Begin typing your search above and press return to search.

డబుల్ ఇస్మార్ట్ రెమ్యునరేషన్.. ఇది అసలు మ్యాటర్

ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ లో డబుల్ ఇస్మార్ట్ మూవీ రామ్ పోతినేని చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   23 April 2024 5:24 AM GMT
డబుల్ ఇస్మార్ట్ రెమ్యునరేషన్.. ఇది అసలు మ్యాటర్
X

టాలీవుడ్ లో ఎనర్జిటిక్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న నటుడు రామ్ పోతినేని. ఈ జెనరేషన్ యువ హీరోలలో స్టైలిష్ లుక్ తో అమ్మాయిల కలల రాకుమారుడు అనే ఇమేజ్ కూడా రామ్ కి ఉంది. సక్సెస్, ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా అతను సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ లో డబుల్ ఇస్మార్ట్ మూవీ రామ్ పోతినేని చేస్తున్నాడు.

వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాని రామ్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే కొన్ని కారణాల వలన ఈ మూవీ షూటింగ్ ఆగింది. దీనికి రామ్ కారణం అనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది. కేవలం ఆర్ధిక సమస్యల కారణంగా కొద్ది రోజులు మూవీ షూటింగ్ వాయిదా వేశారంట.

ఈ సినిమా కోసం రామ్ రెమ్యునరేషన్ తీసుకోకుండా ప్రాఫిట్ లో షేర్ తీసుకొని చేయడానికి సిద్ధం అయ్యాడు. ముందుగా అడ్వాన్స్ తీసుకొని చేయాలని అనుకున్న కూడా తరువాత నిర్ణయం మార్చుకొని ప్రాఫిట్ షేర్ కి ఒకే చెప్పాడు. దీంతో మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అయితే లైగర్ మూవీ ఇంపాక్ట్ డబుల్ ఇస్మార్ట్ మీద పడినట్లు తెలుస్తోంది. వీలైనంత వేగంగా పూరి జగన్నాథ్ ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేయడంపై ఫోకస్ చేశాడని తెలుస్తోంది.

బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపిస్తున్నారు. అలాగే పూరి జగన్నాథ్ కూడా డబుల్ ఇస్మార్ట్ కథ కోసం కాస్తా ఎక్కువ వర్క్ చేసినట్లు తెలుస్తోంది. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ నుంచి బయటకొచ్చి సరికొత్తగా ఈ కథని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మూవీతో పూరి జగన్నాథ్ బౌన్స్ బ్యాక్ కావడంతో పాటు ఇస్మార్ట్ రామ్ కూడా బ్లాక్ బస్టర్ అందుకుంటాడనే మాట ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.

రామ్ పోతినేని సినిమా అవుట్ ఫుట్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇస్మార్ట్ శంకర్ లో రామ్ క్యారెక్టర్ ఎంత బాగా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యిందో అందరూ చూసారు. ఇప్పుడు డబుల్ మైండ్ తో డబుల్ ఇస్మార్ట్ అంతకుమించి అనేలా ఉంటుందట. ఇక సినిమాను ఈ ఏడాది శివరాత్రి టైమ్ లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ సినిమా షూటింగ్ పనులు ఆలస్యం కావడంతో జూన్ 14న విడుదల చేయాలని చూస్తున్నారు. మరి ఈ సినిమాతో రామ్ సందడి ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.