Begin typing your search above and press return to search.

క‌మెడియ‌న్‌పై విరుచుకుప‌డ్డ అగ్ర‌నిర్మాత‌

ప్రేక్షకులకు అద్భుతమైన చిత్రాలను అందించిన ప్ర‌ముఖ‌ ఫిల్మ్ మేకర్ ఇటీవల ఒక ప్రముఖ కామెడీ షోపై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

By:  Tupaki Desk   |   6 May 2024 3:43 AM GMT
క‌మెడియ‌న్‌పై విరుచుకుప‌డ్డ అగ్ర‌నిర్మాత‌
X

ప్రేక్షకులకు అద్భుతమైన చిత్రాలను అందించిన ప్ర‌ముఖ‌ ఫిల్మ్ మేకర్ ఇటీవల ఒక ప్రముఖ కామెడీ షోపై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఇన్‌స్టా మాధ్య‌మంగా స‌ద‌రు చానెల్ పై అత‌డు చెల‌రేగాడు. త‌న‌ను చెడుగా అనుకరించిన హాస్యనటుడిపై తన నిరాశను వ్యక్తం చేశాడు. ఇది చాలా ఛీప్ గా ఉంద‌ని అన్నాడు.

ఈ ఎపిసోడ్ లో హ‌ర్ట‌యిన నిర్మాత ది గ్రేట్ క‌ర‌ణ్ జోహార్. అత‌డు ఇటీవ‌ల ఒక కామెడీ షో ప్రోమోను చూశానని, అందులో ఒక హాస్యనటుడు తనను పేలవంగా అనుకరించాడని పేర్కొన్నాడు. తన తల్లితో కలిసి ప్రోమో చూసాన‌ని తెలిపారు. కరణ్ ఇలా రాసాడు. ``నేను మా అమ్మతో కలిసి కూర్చుని టెలివిజన్ చూస్తున్నాను... గౌరవప్రదమైన ఛానెల్‌లో రియాలిటీ కామెడీ షో ప్రోమోను చూశాను... అనూహ్యంగా పేలవమైన అభిరుచితో ఒక కామిక్ నన్ను అనుకరిస్తోంది... నేను దీనిని ట్రోల్‌ల నుండి ఆశిస్తున్నాను. ముఖం లేని పేరులేని వ్యక్తులు... కానీ 25 సంవత్సరాలుగా వ్యాపారంలో ఉన్న వ్యక్తిని మీ స్వంత పరిశ్రమ అగౌరవపరచగలిగినప్పుడు అది మనం జీవిస్తున్న కాలం గురించి మాట్లాడుతుంది... ఇది నాకు కోపం తెప్పించదు.. అది నాకు బాధను కలిగిస్తుంది!`` అని ఎమోష‌న‌ల్ అయ్యాడు క‌ర‌ణ్‌.

కరణ్ నోట్ ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన నోట్‌లో ఎవరి పేరునూ ప్రస్తావించలేదు. కేవ‌లం త‌న బాధ‌ను నిరాశ‌ను మాత్ర‌మే వ్య‌క్తం చేసాడు. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. కరణ్ నిర్మించిన యోధా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మంచి స‌మీక్ష‌లు వ‌చ్చినా కానీ, చివ‌రికి బాక్సాఫీస్ విజ‌యంగా మార‌లేదు. అతడి తదుపరి నిర్మాణం `మిస్టర్ అండ్ మిసెస్ మహి`. ఇందులో రాజ్‌కుమార్ రావు - జాన్వీ కపూర్ నటీన‌టులు. ఈ చిత్రం మే 31న థియేటర్లలో విడుదల కానుంది. మహేంద్ర సింగ్ ధోని క‌థ‌ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి శరణ్ శర్మ దర్శకత్వం వహించారు.