Begin typing your search above and press return to search.

టాక్సిక్.. కరీనా అందుకే డ్రాప్ అయిందా?

కేజీఎఫ్ సిరీస్ చిత్రాలతో హీరో యష్.. ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే

By:  Tupaki Desk   |   5 May 2024 12:35 PM GMT
టాక్సిక్.. కరీనా అందుకే డ్రాప్ అయిందా?
X

కేజీఎఫ్ సిరీస్ చిత్రాలతో హీరో యష్.. ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. కేజీఎఫ్ పార్ట్ 1, పార్ట్ 2 సినిమాలు పాన్ ఇండియా హిట్లుగా నిలిచాయి. దీంతో యష్ నెక్స్ట్ మూవీ కోసం అన్ని భాషల సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అయితే యష్.. చాలా రోజుల క్రితమే తన నెక్స్ట్ మూవీ 'టాక్సిక్' ని అనౌన్స్ చేశారు. మలయాళీ నటి, దర్శకురాలు గీతా మోహన్ దాస్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఓ ఫెయిరీ టేల్స్ ఫర్ గ్రోన్ అప్స్ అనే సబ్ టైటిల్ తో తెరకెక్కుతున్న టాక్సిక్ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. కర్ణాటకలో షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని సమాచారం. ఈ మూవీని కూడా బ్లాక్ బస్టర్ కేజీఎఫ్ లాగా రెండు పార్టుల్లో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ సినిమాలో హీరో సోదరి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కనిపించనున్నట్లు వార్తలు వచ్చాయి. మేకర్స్.. కరీనాను ఒప్పించేందుకు బాగానే ట్రై చేసినట్లు కూడా టాక్ వినిపించింది. దీంతో టాక్సిక్ పై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి కరీనా తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆమె ప్లేస్ లో లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్నట్టు సమాచారం. దీనిపై మేకర్స్ త్వరలోనే అనౌన్స్ చేయనున్నారట.

ఇక ఈ సినిమా నుంచి కరీనా కపూర్ తప్పుకోవడం వెనుక పలు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమె బయటకు వచ్చినట్లు కొందరు చెబుతున్నారు. అయితే వేరే కారణాలు కూడా ఉన్నాయని ఇంకొందరు అంటున్నారు. ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ ముందుగా చెప్పకపోవడంతో ఆమె హర్ట్ అయ్యి డ్రాప్ అయినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ విషయంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.

1960s బ్యాక్ డ్రాప్ లో గోవాలోని డ్రగ్స్ మాఫియా చుట్టూ టాక్సిక్ మూవీ అంతా తిరుగుతుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని మేకర్స్ ముందుగా కరీనాకు చెప్పలేదట. భారీ బడ్జెట్ తో కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. కియారా అద్వానీ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ సినిమాతో యష్ ఎలాంటి హిట్ కొడతారో చూడాలి.