Begin typing your search above and press return to search.

సితార నాగవంశీ.. ఫుల్ బిజీబిజీగా!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ రాధాకృష్ణ, నాగవంశీ గురించి అందరికీ తెలిసిందే

By:  Tupaki Desk   |   6 May 2024 8:09 AM GMT
సితార నాగవంశీ.. ఫుల్ బిజీబిజీగా!
X

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ రాధాకృష్ణ, నాగవంశీ గురించి అందరికీ తెలిసిందే. ఓ వైపు బడా హీరోలతో పెద్ద సినిమాలు తీస్తూనే.. మరోవైపు మీడియం రేంజ్ తో పాటు కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలు తీస్తూ మంచి హిట్లు కొడుతున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న సినిమాలను రాధాకృష్ణ నిర్మిస్తుండగా.. దాని అనుబంధ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పై ఇతర చిత్రాలను ప్రొడ్యూస్ చేస్తున్నారు నాగవంశీ.

కొన్ని నెలలుగా నాగవంశీ.. వరుసగా సూపర్ హిట్లు అందుకుంటున్నారు. గత ఏడాది సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి సార్, మ్యాడ్ వంటి విజయవంతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇటీవల టిల్లు స్క్వేర్ తో భారీ విజయం అందుకున్నారు నాగవంశీ. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.125 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

ఇప్పుడు సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ చేతిలో ఒకటి కాదు.. రెండు కాదు.. పదికిపైగా క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో కొన్ని ఇప్పటికే సెట్స్ పై ఉండగా.. మరిన్ని త్వరలో స్టార్ట్ కానున్నాయి. ఇంకొన్ని రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. త్వరలో మరిన్ని ప్రాజెక్టుల అనౌన్స్మెంట్స్ కూడా రానున్నాయి. అయితే సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ చేతిలో ఉన్న వివిధ సినిమాల వివరాలివే.

సితార సంస్థ రూపొందించిన మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం మే17వ తేదీన విడుదల కానుంది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి ఫిమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కాంబోలో తెరకెక్కుతున్న NBK 109 మూవీని కూడా నాగవంశీనే నిర్మిస్తున్నారు. దసరాకు ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు ఇంకా ఏ చిత్రాలు ఉన్నాయంటే?

దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్- షూటింగ్ మోడ్

విజయ్ దేవరకొండ VD 12- షూటింగ్ మోడ్

కళ్యాణ్ శంకర్ మ్యాడ్ స్క్వేర్- షూటింగ్ మోడ్

గౌతమ్ తిన్ననూరి మ్యాజిక్- పోస్ట్ ప్రొడక్షన్

డైరెక్టర్ భాను, రవితేజ చిత్రం- ప్రీ ప్రొడక్షన్

సిద్ధు జొన్నలగడ్డ టిల్లు క్యూబ్- త్వరలో స్టార్ట్

యంగ్ హీరో ఆశిష్ తో ఓ మూవీ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు నాగవంశీ. మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా ఓ సినిమాను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. సాయి ధరమ్ తేజ్, నవీన్ పోలిశెట్టితో చెరో చిత్రం చేయనున్నట్లు తెలుస్తోంది. అలా వివిధ ప్రాజెక్ట్స్ సితార ఎంటర్టైన్మెంట్స్ చేతిలో ఉన్నాయి. మరి ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్ అవుతాయో చూడాలి.