Begin typing your search above and press return to search.

వైసీపీ గెలుపును కన్ఫాం చేసిన టీడీపీ... వీడియో వైరల్!

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గరపడుతున్న వేళ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

By:  Tupaki Desk   |   20 April 2024 10:30 AM GMT
వైసీపీ గెలుపును కన్ఫాం చేసిన టీడీపీ...  వీడియో వైరల్!
X

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గరపడుతున్న వేళ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే తెరపైకి వచ్చిన పలు సర్వేలు.. ఈ ఎన్నికల్లో మరోసారి వైసీపీ గెలుపు కన్ ఫాం అని చెబుతున్న నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టీడీపీకి చెందినదిగా చెబుతున్న ఒక వీడియో 147 స్థానాల్లో వైసీపీ గెలుపును దాదాపు కన్ ఫాం చేసింది!

అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ షెడ్యూల్ కంటే ముందే దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను కన్ ఫాం చేసిన జగన్... అంతకంటే ముందు "సిద్ధం" అంటూ రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేశారు.. ఫలితంగా కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపారు. ఇదే సమయంలో ఇప్పుడు "మేమంతా సిద్ధం" అంటూ బస్సుయాత్ర చేపట్టారు.. ప్రజలకు చెప్పాలనుకున్న విషయం సూటిగా చెబుతున్నారు.

పైగా ఈ సభలకు, బస్సు యాత్రలకు వచ్చిన జనం, వస్తోన్న జనం చూసినవారంతా ఒక్కసారిగా ట్రెండ్ మారిపోయిందని అంటున్నారు! ఇదే సమయంలో గతంలో ఏనాడు ఈ స్థాయిలో భారీ బహిరంగ సభలు జరగలేదని అంటున్న పరిస్థితి. అదేవిధంగా.. అధినేతల మధ్య పొసిగినంతగా.. నేతల మధ్య పొసగలేదని కూటమి గురించిన కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో పలు సర్వే ఫలితాలు వైసీపీకి అనుకూలంగా వస్తున్నాయి!

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. తాజాగా టీడీపీ ఇంటర్నల్ సమావేశంలోని ఒక వీడియోలో కూడా వైసీపీ బలంగా ఉందనే విషయాన్ని కన్ ఫాం చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. రానున్న ఎన్నికల్లో తమదే విజయం అని వైసీపీ నేతలు చెబుతుండటం.. వారి మాటలకు సర్వే ఫలితాలు బలం చేకూరుస్తుండటంతో పాటు ఇప్పుడూ ఈ వీడియో కూడా వెలుగులోకి రావడంతో వైసీపీ శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయని అంటున్నారు.

ఇందులో భాగంగా... టీడీపీ ఇంటర్నల్ మీటింగ్ లోని ఆ వీడియోలో.. పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా టీడీపీ స్టేట్ ఎలక్షన్ సెల్ కోఆర్డినేటర్ కోనేరు సురేష్... పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేస్తున్నారు! ఈ సమయంలో... సుమారు 147 స్థానాల్లో టీడీపీ - జనసేన - బీజేపీ కూటమికంటే ఎక్కువగా వైసీపీ 2శాతం ఓట్లతో బలంగా ఉందని చెబుతున్నారు అని అంటున్నారు! దీంతో... పైకి ఎన్ని చెప్పినా.. వైసీపీ బలంగా ఉందని టీడీపీ ఇంటర్నల్ మీటింగ్స్ లో చర్చ జరుగుతుందనే విషయం స్పష్టమైందని అంటున్నారు పరిశీలకులు!

ఈ నేపథ్యంలోనే... “వైసీపీ గెలుపును కన్ ఫాం చేసిన టీడీపీ” అంటూ సోషల్ మీడియా హోరెత్తిపోతుంది.. “మళ్లీ జగనే” అనే కామెంట్లు హల్ చల్ చేస్తున్నాయి.