Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ తరుపున ప్రచారానికి వెంకటేశ్ సిద్ధం... డేట్ ఫిక్స్!

కాగా... హీరో వెంకటేష్‌ కుమార్తె అశ్రితను రఘురాంరెడ్డి పెద్ద కుమారుడు వినాయక్‌ రెడ్డి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   30 April 2024 10:06 AM GMT
కాంగ్రెస్  తరుపున ప్రచారానికి వెంకటేశ్  సిద్ధం... డేట్  ఫిక్స్!
X

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ తేదీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. దాదాపు మరో 10 రోజుల్లో ప్రచార పర్వాలకు తెరపడనుంది! ఈ సమయంలో ఆయా అభ్యర్థుల తరుపున పలువురు స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం కోసం బరిలోకి దిగుతున్నారు. వీరితో పాటు వారి వారి కుటుంబ సభ్యులు ఇప్పటికే పనిలో బిజీగా ఉన్నారు. ఈ సమయంలో విక్టరీ వెంకటేష్ ఎన్నికల ప్రచారానికి దిగబోతున్నారని తెలుస్తుంది.

అవును... తెలంగాణలోని ఓ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయడానికి స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా... ఖమ్మం కాంగ్రెస్ పార్టీ లోక్‌ సభ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి గెలుపు కోసం ఆయన రంగంలోకి దిగబోతున్నారని సమాచారం. దీంతో కీలకమైన ఖమ్మం లోక్ సభ స్థానంలో ఈ విషయం వైరల్ గా మారింది.

ఈ క్రమంలోనే మే 7న ఖమ్మంలో వెంకటేష్‌ తో ప్రచారం చేసేందుకు షెడ్యూల్ ఫిక్స్ అయినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి సమాచారం వస్తోంది! దీంతో అటు కాంగ్రెస్ శ్రేణులతో పాటు వెంకటేష్ అభిమానుల్లోనూ కోలాహలం మొదలైంది. అయితే కాంగ్రెస్ పార్టీ తరుపున ఆయన ప్రచారం కేవలం ఖమ్మం పార్లమెంట్ వరకే ఉంటుందని తెలుస్తోంది.

కాగా... హీరో వెంకటేష్‌ కుమార్తె అశ్రితను రఘురాంరెడ్డి పెద్ద కుమారుడు వినాయక్‌ రెడ్డి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సైతం రఘురాం రెడ్డి వియ్యంకుడు అవుతారు. ఈ క్రమంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే వియ్యంకుడి గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు.

ఈ సమయంలో... విక్టరీ వెంకటేష్ సైతం రఘురాం రెడ్డి కోసం బరిలోకి దిగబోతున్నారని అంటున్నారు. మరి వీరి ప్రచారం అభ్యర్థి రఘురాం రెడ్డికి ఎంత వరకు కలిసి వస్తుందనేది వేచి చూడాలి. ఏది ఏమైనా.. ఎన్నికల ప్రచారం వెంకటేష్ ని చూడటం థ్రిల్లింగ్ విషయమని అంటున్నారు ఫ్యాన్స్!