Begin typing your search above and press return to search.

బాలయ్య హిట్టు టైటిల్ వాడేస్తున్న కుర్ర హీరో

ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో మనమే టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   29 March 2024 5:10 AM GMT
బాలయ్య హిట్టు టైటిల్ వాడేస్తున్న కుర్ర హీరో
X

టాలీవుడ్ యంగ్ హీరోలలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న నటుడు శర్వానంద్, శర్వా చివరిగా ఒకే ఒక జీవితం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో మనమే టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. కృతి శెట్టి ఈ మూవీలో శర్వానంద్ కి జోడీగా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే శర్వానంద్ తన నెక్స్ట్ మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సామజవరగమన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ రామ్ అబ్బరాజు నెక్స్ట్ శర్వానంద్ తో మూవీ ఒకే చేసుకున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సంయుక్త మీనన్, సాక్షి వైద్య ఈ చిత్రంలో శర్వానంద్ కి జోడీగా నటిస్తున్నారంట.

ఇదిలా ఉంటే ఈ చిత్రానికి బాలకృష్ణ సూపర్ హిట్ మూవీ టైటిల్ ని కన్ఫర్మ్ చేశారు. 1990లో బాలకృష్ణ హీరోగా కోదండరామి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన నారి నారి నడుమ మురారి ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. బాలయ్య కెరియర్ లో రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చి సూపర్ హిట్ అయిన సినిమాలలో ఇది ఒకటి. ఇప్పుడు ఈ మూవీ టైటిల్ నే శర్వానంద్ సినిమా కోసం రామ్ అబ్బరాజు ఉపయోగించుకుంటున్నారంట.

కథ ప్రకారం ఇది కూడా ఇద్దరు భామల మధ్యలో హీరో పడే వేదనతో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతుందంట. అందుకే మూవీకి నారినారి నడుమ మురారి టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. శర్వానంద్ లో మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన రన్ రాజా రన్ మూవీలో హిలేరియస్ గా కామెడీ పండించాడు. అలాగే ఎక్స్ ప్రెస్ రాజా, రాధా సినిమాలలో కూడా కామిక్ టచ్ ఉన్న హీరో పాత్రలలో నటించాడు.

నారి నారి నడుమ మురారి సినిమాలో కూడా అంతకుమించి కామెడీ ఉంటుందంట. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించబోతున్నారు. జ్ఞాన శేఖర్ విఎస్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయబోతున్నారు. సామజవరగమన లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఏడాది గ్యాప్ తీసుకొని రామ్ అబ్బరాజు ఈ మూవీని చేయబోతున్నాడు. త్వరలో సినిమాపై అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాబోతుందని తెలుస్తోంది. శర్వానంద్ 37వ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కనుంది.