Begin typing your search above and press return to search.

జనసేన నేత నాగబాబు స్ట్రాంగ్ వార్నింగ్... తెరపైకి కీలక వ్యాఖ్యలు!

ఆంధ్రప్రదేశ్‌ లో సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో.. నేతల మధ్య మాటలు యుద్ధం పీక్స్ కి చేరుతున్నాయి.

By:  Tupaki Desk   |   28 April 2024 9:35 AM GMT
జనసేన నేత నాగబాబు స్ట్రాంగ్  వార్నింగ్... తెరపైకి కీలక వ్యాఖ్యలు!
X

ఆంధ్రప్రదేశ్‌ లో సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో.. నేతల మధ్య మాటలు యుద్ధం పీక్స్ కి చేరుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ నేతలకి, కూటమి నేతలకు మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోన్న పరిస్థితి. ఈ క్రమంలో తాజాగా జనసేన కీలక నేత నాగబాబు వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ను ఓడించడంకోసం.. కడప నుండి గుండాలను తీసుకువస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇదే సమయంలో... ఇండిపెండెంట్ అభ్యర్థి గీత ప్రస్థావన తెచ్చారు.

అవును... తనను టార్గెట్ చేస్తూ సుమారు 40 మంది ఎర్రచందనం స్మగ్లర్లు తనకోసం పిఠాపురం వచ్చారంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమవుతున్న సంగతి తెలిసిందే. తనను చంపడానికి ట్రై చేస్తున్నారని.. రాళ్లు విసురుతున్నారన్ని.. అమలాపురం సభలోనూ సీమ గూండాలు దిగారని.. పిఠాపురంలో బ్లేడ్ బ్యాచ్ దిగిందని చెప్పుకున్న సంగతి ఎలిసిందే! ఈ సమయంలో తీవ్ర విమర్శలు వచ్చయని చెబుతున్నారు.

ఈ సమయంలో స్పందించిన నాగబాబు వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ను ఓడించేందుకు, కడప నుండి గుండాలను తీసుకువస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కుట్ర వెనక మిథున్ రెడ్డి దాడిశెట్టి రాజా ఉన్నారని నాగబాబు ఆరోపించారు. వారిరువురూ కలిసి పవన్ కళ్యాణ్‌ ను ఓడించేందుకు పన్నాగాలు పన్నుతున్నారని ఆయన మండిపడ్డారు. ఎవరు ఏం చేసినా.. ఎంతమందిని తీసుకొచ్చిన పవన్‌ ను ఓడించడం అసాధ్యమని ఈ సందర్భంగా నాగబాబు ధీమా వ్యక్తం చేశారు.

ఇదే క్రమంలో... "ఒక మహిళ ఇండిపెండెంట్ గా పిఠాపురంలో పోటీ చేయకూడదా" అని ప్రశ్నించిన నాగబాబు... "జనసేన అభ్యర్థులు బరిలో ఉన్నచోట డమ్మీ పేర్లలో మీరు నామినేషన్స్ వేయించలేదా" అని వైసీపీ నేతలను ప్రశ్నించారు! ఇదే క్రమంలో... వైసీపీ నేతలు ఓడిపోయే స్టేజ్ లో ఉన్నారని చెబుతున్నా.. పిఠాపురంలో ఎవరిపైన అయినా చేయిపడితే మామూలుగా ఉండదని హెచ్చరించడం గమనార్హం!