Begin typing your search above and press return to search.

హాసన సెక్స్‌ కుంభకోణం.. తెరపైకి బాధితురాలిపై బిగ్ అప్ డేట్!

మాజీ ప్రధాని, జేడీఎస్‌ అగ్రనేత దేవెగౌడ తనయుడు రేవణ్ణ తోపాటు.. మనవడు, ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ లపై లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   29 April 2024 11:27 AM GMT
హాసన సెక్స్‌ కుంభకోణం.. తెరపైకి బాధితురాలిపై బిగ్ అప్ డేట్!
X

మాజీ ప్రధాని, జేడీఎస్‌ అగ్రనేత దేవెగౌడ తనయుడు రేవణ్ణ తోపాటు.. మనవడు, ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ లపై లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఓ మహిళ ఫిర్యాదు మేరకు హోళెనరసిపుర్‌ పోలీసులు ఎఫ్‌.ఐ.ఆర్‌. నమోదు చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ ఇష్యూ తీవ్ర వైరల్ అయిన సంగతి తెలిసిందే. మరోవైపు.. ప్రజ్వల్‌ కు సంబంధించినవిగా చెబుతున్న అసభ్యకర వీడియోల వ్యవహారం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది!

దీంతో.. ఆ వీడియోల వ్యవహారం ఏమిటో దర్యాప్తు చేయాలని భావించిన కర్ణాటక ప్రభుత్వం.. ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ఈ సమయంలో కర్ణాటక రెవెన్యూ మంత్రి కృష్ణ భైరేగౌడ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోపక్క బాధితురాలికి సంబంధించిన ఆసక్తికర విషయాలు తెరపైకి వస్తున్నాయి. దీంతో... ఈ వ్యవహారం ఎలాంటి ముగింపు తీసుకోబోతుందనేది ఆసక్తిగా మారింది.

అవును... సంచలన సృష్టించిన హాసన సెక్స్‌ కుంభకోణంలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయని తెలుస్తుంది. కర్ణాటక మీడియా కథనాల ప్రకారం... మాజీ మంత్రి హెచ్‌.డీ రేవణ్ణ.. ఆయన కుమారుడు, ఎంపీ ప్రజ్వల్‌ పై లైంగిక దౌర్జన్యం కింద కేసు నమోదు చేసిన మహిళ (47).. భవానీ రేవణ్ణకు స్వయానా మేనత్త కుమార్తె అని, ఆమె రేవణ్ణకు సోదరి వరస అవుతుందని అంటున్నారు. ఇదే క్రమంలో... రేవణ్ణ మంత్రిగా ఉన్న సమయంలో ఆమెకు నాగలాపుర పాల కేంద్రంలో పని ఇప్పించారని చెబుతున్నారు.

అయితే... ఫిర్యాదు చేసిన బాధితురాలు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసిందని అంటున్నారు. ఇందులో భాగంగా... రేవణ్ణ నివాసంలో ఆరుగురు మహిళలు, యువతులు పని చేస్తున్నారని చెప్పిన బాధితురాలు.. పనిలో చేరిన నాలుగు నెలల నుంచి తనను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారని.. భవానీ రేవణ్ణ ఇంట్లో లేని సమయంలోనే తనపై లైంగిక దౌర్జన్యానికి దిగేవారని బాధితురాలు ఆరోపించిందని స్థానిక మీడియాలో కథనాలొస్తున్నాయి!

ఇదే క్రమంలో... తాను వంట గదిలో ఉన్నప్పుడు ప్రజ్వల్‌ రేవణ్ణ శరీరాన్ని తాకుతూ వేధించేవారని.. నలుగు పెట్టి స్నానం చేయించాలని, ఒంటికి నూనె రాసి స్నానం చేయించాలని స్నానాలగదికి తీసుకువెళ్లి లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించినట్లు చెబుతున్నారు. అదేవిధంగా... ఇంట్లో నుంచి తన కుమార్తెకు వీడియో కాల్‌ చేసి ప్రజ్వల్‌ అసభ్యంగా ప్రవర్తించేవాడని.. అతని చేష్టలకు భయపడి ఆమె.. ప్రజ్వల్‌ ఫోన్‌ నంబరును బ్లాక్‌ చేసుకుందని.. అనంతరం తానూ పని విడిచిపెట్టి బయటకు వచ్చేశానని అమె తెలిపిందని చెబుతున్నారు.

ఈ పరిస్థితుల్లో... గత కొద్ది రోజులుగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉండడంతో తన భర్త నుంచి ఎదురైన ఇబ్బందుల నేపథ్యంలో.. తప్పనిసరి పరిస్థితులతో జరిగిన ఘటనలతో ఫిర్యాదు చేస్తున్నానని ఆమె వెల్లడించిందని స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి!

మరోపక్క ఈ విషయాలపై స్పందించిన కర్ణాటక రెవెన్యూ మంత్రి కృష్ణ భైరేగౌడ... హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ లైంగిక దౌర్జన్యాలకు పాల్పడిన కేసులో వాస్తవాలను వెలికి తీసేందుకు ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసిందని వెల్లడించారు. ఇదే క్రమంలో... రేవణ్ణ నివాసంలోనే ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం సిగ్గు చేటని వ్యాఖ్యానిస్తూ.. దర్యాప్తులో ప్రభుత్వ జోక్యం ఉండదని మంత్రి స్పష్టం చేశారు.