పింక్ బికినీలో క్యూట్ తెలుగమ్మాయి

టాలీవుడ్ లో తొలి అడుగులు వేసినప్పటికీ, బాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రేయా ధన్వంతరి.

Update: 2024-09-06 00:30 GMT

 టాలీవుడ్ లో తొలి అడుగులు వేసినప్పటికీ, బాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రేయా ధన్వంతరి. నాగ చైతన్య జోష్ సినిమాలో సపోర్టింగ్ రోల్‌తో ఎంట్రీ ఇచ్చిన శ్రేయా, సందీప్ కిషన్ స్నేహగీతం సినిమాలో హీరోయిన్‌గా నటించింది. కానీ, తెలుగులో ఎక్కువ అవకాశాలు రాకపోవడంతో ముంబైకి వెళ్లిపోయింది.

ముంబైలో మోడలింగ్ కెరీర్‌ ప్రారంభించిన ఆమెకు అక్కడ మంచి అవకాశాలు వచ్చాయి. ఆ తరువాత బాలీవుడ్ లో 'వై చీట్ ఇండియా' సినిమాలో ఇమ్రాన్ హష్మీతో కలిసి నటించి, మంచి పేరు తెచ్చుకుంది. తదనంతరం 'లూప్ లపేట', 'చుప్', 'అన్ పాసెడ్' వంటి సినిమాల్లో కూడా నటించి, తన క్రేజ్ పెంచుకుంది. ప్రస్తుతం ఆమె చేసిన కొన్ని చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

సినిమాలకే పరిమితం కాకుండా, డిజిటల్ ప్లాట్ఫార్మ్స్ లోనూ ఆమె రాణిస్తోంది. 'ది ఫ్యామిలీ మెన్' వెబ్ సిరీస్‌లో శ్రేయా తన నటనతో ప్రత్యేకంగా నిలిచింది. గన్స్ అండ్ గులాబ్స్‌లో కూడా నటించి, మంచి ప్రశంసలు అందుకుంది. తన నటనతో పాటు సోషల్ మీడియాలో కూడా శ్రేయా ఆకట్టుకుంటోంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో గ్లామరస్ ఫోటోషూట్లను రెగ్యులర్‌గా షేర్ చేస్తూ, అభిమానులను ఆకర్షిస్తోంది. ఈ మధ్యనే ‘విమెన్ ఫిట్ నెస్ ఇండియా’ మ్యాగజైన్ కవర్‌ పేజీ కోసం శ్రేయా ప్రత్యేకంగా ఫోటోషూట్ చేయగా, అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక లేటెస్ట్ గా పింక్ కలర్ బికినీ లో మరింత అందంగా కనిపించింది. తన గ్లామర్‌తో పాటు, నటనలోనూ మంచి పేరు తెచ్చుకున్న శ్రేయా, మరిన్ని బాలీవుడ్ ప్రాజెక్టులలో నటించేందుకు సిద్ధమవుతోంది. ఇదే తరహాలో మరో తెలుగు నటి శోభిత దూళిపాళ్ల కూడా బాలీవుడ్‌లో తన ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే.



Tags:    

Similar News