ర‌కుల్ భ‌ర్త‌కి ఖిలాడీ ఊర‌ట‌!

`బడేమియాన్ చోటే మియాన్` ప్లాప్ తో ర‌కుల్ ప్రీత్ సింగ్ భ‌ర్త‌, బాలీవుడ్ నిర్మాత జాకీ భ‌గ్నానీ ఆర్దిక ఇబ్బం దుల్లో ప‌డిన సంగ‌తి తెలిసిందే.

Update: 2024-07-02 06:52 GMT

`బడేమియాన్ చోటే మియాన్` ప్లాప్ తో ర‌కుల్ ప్రీత్ సింగ్ భ‌ర్త‌, బాలీవుడ్ నిర్మాత జాకీ భ‌గ్నానీ ఆర్దిక ఇబ్బం దుల్లో ప‌డిన సంగ‌తి తెలిసిందే. అప్పులు తీర్చ‌డం కోసం సొంత ఆఫీస్ నే అమ్ముకోవాల్సిన ప‌రిస్థితి దాప‌రించింది. సినిమా మీద న‌మ్మకంతో 350 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసినా వంద కొట్లే రిట‌ర్న్ రావ‌డంతో భారీ న‌ష్టాలు తెచ్చిన చిత్రంగా తేలింది. ఇంకా ఆ సినిమాకి ప‌నిచేసిన న‌టీన‌టుల‌కు, సాంకేతిక నిపుణుల‌కు పారితోషికాలు పూర్తిగా చెల్లించింది లేదు.

అలాగే ఆఫీస్ స్టాప్ కి జీతాలు కూడా ఇవ్వక‌పోవ‌డంతో ఆందోళ‌న చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో జాకీ భ‌గ్నానీ ఏం చేయాలో తెలియ‌ని సందిగ్దంలో ప‌డ్డాడు. ఉన్న ఆస్తుల్ని అమ్మేసి అప్పులు తీర్చే ప‌నిలో ప‌డ్డాడు. ఈ నేప‌థ్యంలో అక్ష‌య్ కుమార్ ...కాస్త ఊర‌ట‌నిచ్చాడు. త‌న‌కి ఇప్ప‌టికిప్పుడు డ‌బ్బులు ఇవ్వాల్సిన ప‌నిలేద‌ని, ముందుగా అర్జెంట్ అనుకున్న వారంద‌రీ బ‌కాయిలు చెల్లించిన త‌ర్వాత చివ‌ర‌గా త‌న‌కి ఇవ్వ‌మ‌ని సూచించాడుట‌.

Read more!

అంద‌రికంటే ఎక్కువ మొత్తం ఇవ్వాల్సింది అక్ష‌య్ కుమార్ కే న‌ట‌. అలాగే అదే నిర్మాత‌తో మ‌రో సినిమా కూడా చేస్తాన‌ని అక్ష‌య్ ప్రామిస్ చేసాడు. జాకీ భ‌గ్నానీ ప‌రిస్థితిని అర్దం చేసుకుని మంచి మ‌న‌సుతో అక్ష‌య్ ఇలా ముందుకు రావ‌డం ప‌ట్ల అభిమానులు హర్షం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రికొంత మంది అలా చెప్పారు గానీ అక్ష‌య్ కుమార్ ఈ సినిమాకి బ్యాలెన్స్ తీసుకోర‌ని , ఆ మాట‌నే అలా చెప్పి ఉంటాడ‌ని భావిస్తున్నారు.

అయితే జాకీ భగ్నానీ మాత్రం ఎవ‌రూ డ‌బ్బులు ఉంచుకోన‌ని, ఇచ్చిన మాట ప్ర‌కారం ఎవ‌రికి చెల్లించా ల్సింది చెల్లిస్తాన‌ని చెబుతున్నాడు. ఈ సంద‌ర్భంగా అక్ష‌య్ కి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసాడు. `అక్ష‌య్ స‌ర్ క‌ష్ట కాలంలో మా వెంట నిల‌బ‌డ్డారు. మా ప‌ట్ల ఆయ‌న చూపించిన ప్రేమ‌కు కృత‌జ్ఞ‌త‌లు. ఒక్కోసారి అంచ‌నాలు తప్పుతాయి. ప‌రిస్థితులు మార‌తాయి. మ‌ళ్లీ నెమ్మ‌దిగా అన్నీ కుదురుకుంటాయి` అని అన్నారు.

Tags:    

Similar News