బ‌న్నీ, ప‌వ‌న్ ని ప‌క్క‌న‌బెట్టిన శిరీష్!

ఈ మ‌ధ్య కాలంలో మెగా-అల్లు ఫ్యామిలీ మ‌ధ్య రాజ‌కీయ అంశాలు ఎంత‌టి చ‌ర్చ‌నీయాంశంగా మారాయో తెలిసిందే

Update: 2024-08-02 09:42 GMT

ఈ మ‌ధ్య కాలంలో మెగా-అల్లు ఫ్యామిలీ మ‌ధ్య రాజ‌కీయ అంశాలు ఎంత‌టి చ‌ర్చ‌నీయాంశంగా మారాయో తెలిసిందే. రెండు కుటుంబాల మ‌ధ్య స‌ఖ్య‌త దెబ్బ తింది అటూ నెట్టింట పెద్ద ఎత్తుర చ‌ర్చ సాగుతోన్న వేళ అల్లు అర‌వింద్ ఫ్యామిలీకి స‌న్నిహితంగా ఉండే నిర్మాత బ‌న్నీ వాస్ దానిపై వివ‌ర‌ణ ఇవ్వ‌డం.. చిరంజీవిని బ‌న్నీ వాస్ హైలైట్ చేయ‌డం జ‌రిగింది. అటుపై మెగా ప్రిన్సెస్ నిహారిక కూడా ఓ ఇంట‌ర్వ్యూలో ఇలాంటి విష‌యాలేవి త‌న‌కు తెలియ‌ద‌ని..ఇంట్లో అలాంటి టాపిక్స్ రావ‌ని చెప్పింది.

ఈ నేప‌థ్యంలో తాజాగా అల్లు శిరీష్ లైన్ లోకి వ‌చ్చాడు. ఆయ‌న హీరోగా న‌టించిన `బ‌డ్డీ` సినిమా రిలీజ్ నేప‌థ్యంలో ఆ రెండు ఫ్యామిలీల నుంచి తానేం నేర్చుకున్నాడో చెప్పే ప్ర‌య‌త్నం చేసాడు. అన్నయ్య అల్లు అర్జున్ నాకు ఇష్టమైన బడ్డీ. ఆయనతోనే అన్ని విషయాలు పంచుకుంటాను. పవన్ కళ్యాణ్ గారు మాన‌సికంగా ఎంతో స్ట్రాంగ్ గా ఉంటారు. ఆయ‌న లాంటి మాన‌సికం ధైర్యం ఇంకెవ్వ‌రిలో లేదు. ఇక మా నాన్న రోబో టైపు. అన్ని పనులు సమయానికి పూర్తి చేయాలని తాపత్రయపడతారు. అలాగే ప‌నిచేస్తారన్నారు.

అలాగే మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ... ` ఆయ‌న‌కు పాజిటివిటీ ఎక్కువని.. అందరితోనూ మర్యాదగా వ్యవహరిస్తారని.. పవన్ చెప్పినట్లు చిరంజీవిని ఎంత ద్వేషించినా ఆయన ప్రేమనే పంచుతార`న్నాడు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ గా మారాయి. మొన్న‌టి బ‌న్నీ వాస్ వివ‌ర‌ణ‌..నేడు శిరీష్ క్లారిటీ కి అభిమానులు సంతోషం ప‌డుతున్నారు.

ఇక శిరీష్ `బ‌డ్డీ` సినిమా బాగా వ‌చ్చింద‌ని, ఇంటిల్లాపాదిచూసే సినిమా అని తెలిపాడు. నిర్మాతతో చర్చించి టికెట్ రేట్లు కూడా తగ్గించామన్నారు. టికెట్ ధరలు పెంచి ప్రేక్షకుల నుంచి డబ్బు సంపాదించేకన్నా.. ఎక్కువ మందిని థియేటర్లకు రప్పించి, మరింత సంపాదించొచ్చన్నది తమ‌ సూత్రమని శిరీష్ తెలిపాడు. త‌మ ప్ర‌య‌త్నం స‌క్సెస్ అయితే మ‌రింత మంది ఇదే మార్గాన్ని అనుస‌రిస్తార‌న్నాడు.

Tags:    

Similar News