'బేబీ' ఆనంద్.. మళ్ళీ నవంబర్ టార్గెట్!

ప్రస్తుతం ఆయన గం గం గణేశా అనే సినిమాలో నటిస్తున్నారు. కాగా, ఈ మూవీ షూటింగ్ కూడా తాజాగా చివరి దశకు చేరుకోవడం విశేషం.

Update: 2023-08-23 09:16 GMT

ఆనంద్ దేవరకొండ మంచి స్పీడు మీద ఉన్నాడు. ఇటీవల బేబీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. నిజానికి, ఈ మూవీ ఇంత హిట్ అందుకుంటుందని ఎవరూ ఊహించలేదు. చిన్న సినిమా గా వచ్చి, పెద్ద హిట్ కొట్టాడు. ఈ మూవీ విడుదలై, నెల రోజులు అవుతోంది. ఇంకా, ప్రేక్షకులు ఈ మూవీ నుంచి బయటకు కూడా రాలేదు. ఈ లోగా, ఆనంద్ మరో సినిమాను పూర్తి చేసే పనిలో బిజీ అయ్యాడు.


విజయ్ దేవరకొండ సోదరుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆనంద్, దొరసాని సినిమాతో అరంగేట్రం చేశాడు. మొదటి సినిమాలో నటన విషయంలో కాస్త తడపడినా, తర్వాతర్వాత నటుడిగా తనను తాను మెరుగుపరుచుకున్నాడు. ముఖ్యంగా బేబీ సినిమాలో అతని నటనకు అందరూ ఫిదా అయిపోయారు.


ప్రస్తుతం ఆయన గం గం గణేశా అనే సినిమాలో నటిస్తున్నారు. కాగా, ఈ మూవీ షూటింగ్ కూడా తాజాగా చివరి దశకు చేరుకోవడం విశేషం. హై-లైఫ్ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. క్రైమ్ యాక్షన్ డ్రామా గా ఈ సినిమా తెరకెక్కుతోంది.


ఇక, ఈ సినిమాని నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈలోగా చిత్ర బృందం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే అవకాశం ఉంది. ఇక, ఈ సినిమాలో ఎక్కువ మందిని కొత్తవారిని తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ఆనంద్ ని ఇప్పటి వరకు చాలా సాఫ్ట్ గా , పక్కింటి అబ్బాయి పాత్రలోనే చూశారు.

ఈ సినిమాతో యాక్షన్ హీరోగా మారే అవకాశం ఉంది. చాలా భిన్నంగా ఈ సినిమా సాగుతుందని చిత్ర బృందం చెబుతోంది. బేబీ సినిమాతో ఆనంద్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తొలిసారి డిఫరెంట్ జోనర్ ట్రై చేస్తున్నాడు. అలాగే మరికొన్ని డిఫరెంట్ సినిమాలను కూడా అతను లైన్ లో పెట్టె ప్రయత్నం చేస్తున్నారు. మరి గం గం గణేశా మూవీతో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి. త్వరలోనే ఈ సినిమా అఫీషియల్ రిలీజ్ డేట్ పై క్లారిటీ రానుంది.

Tags:    

Similar News