సారీ స్వామి ఆల‌స్య‌మైంది అనేసిన అనీల్!

తాజాగా యంగ్ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి నేడు తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్నాడు.

Update: 2024-07-05 12:33 GMT

టాలీవుడ్ సెల‌బ్రిటీల‌కు శ్రీవారి స‌న్నిధానం అన్న‌ది ఓ సెంటిమెంట్. సినిమా రిలీజ్ కి ముందు..రిలీజ్ త‌ర్వాత స‌క్సెస్ అయితే మొక్కులు చెల్లించ‌డం అన్న‌ది త‌రుచూ జరుగుతుంది. చాలా మంది ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు, హీరోలు అంతా శ్రీవారి సేవ‌లో పాల్గొంటారు. తాజాగా యంగ్ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి నేడు తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్నాడు. అనంత‌రం తీర్ద ప్ర‌సాదాలు అందుకున్నాడు.

అటుపై మీడియాతో మాట్లాడుతూ త‌న మొక్కు సంగ‌తి రివీల్ చేసాడు. 'భ‌గ‌వంత్ కేస‌రి సినిమా త‌ర్వాత శ్రీవారిని ద‌ర్శించుకోవాల‌నుకున్నా. కానీ అనుకోని కార‌ణాల వ‌ల్ల రావ‌డం ఆల‌స్య‌మైంది. ఇన్నాళ్ల‌కు ఆ మొక్కు చెల్లించాను. ఇప్పుడు మ‌న‌సు సంతోషంగా ఉంది. ఎప్పుడూ శ్రీవారిని ద‌ర్శించుకున్నా తెలియ‌ని ఎన‌ర్జీ వ‌స్తుంది. మ‌న‌సు ప్ర‌శాంతంగా ఉంటుంది. తిరుమ‌ల రావ‌డం అంటే ఎంతో ఇష్టం' అని అన్నారు.

బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా అనీల్ రావిపూడి 'భ‌గ‌వంత్ కేస‌రి' చిత్రాన్ని తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. 100 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను సాధించింది. అప్ప‌టికే వ‌రుస విజయాల్లో ఉన్న అనీల్ కి మ‌రో భారీ స‌క్సెస్ లా నిలిచింది. ఇంత‌వ‌ర‌కూ అనీల్ కి వైఫ‌ల్య‌మే లేదు. త‌న‌దైన శైలిలో వినోదం పంచుతూ స‌క్సెస్ లు అందుకుంటున్నాడు. త్వ‌ర‌లోనే విక్ట‌రీ వెంక‌టేష్ తో కొత్త ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కించ‌నున్నాడు.

Read more!

ఇక బాల‌య్య కూడా వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నారు. 'అఖండ‌', 'వీర సింహారెడ్డి', 'భ‌గ‌వంత్ కేస‌రి'తో పుల్ స్పీడ్ లో ఉన్నారు. ప్ర‌స్తుతం బాబి ద‌ర్శ‌క‌త్వంలో ఓసినిమా చేస్తున్నారు. అది పూర్త‌యిన వెంట‌నే బోయ‌పాటి శ్రీను ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కుతుంది. ఈ చిత్రంతో బాల‌య్య చిన్న కుమార్తె నిర్మాత‌గా ప‌రిచ‌య‌మ‌వ్వ‌డం విశేషం.

Full View
Tags:    

Similar News

eac