స్టార్ హీరో సినిమాకి సీక్వెల్..ఇదేం ట్విస్ట్?

Update: 2022-11-27 00:30 GMT
కోలీవుడ్ హీరో శింబు క‌థానాయ‌కుడిగా వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన 'మానాడు' త‌మిళ్ లో భారీ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈసినిమా హిట్ తో శింబు పేరు మ‌ళ్లీ మారుమ్రోగుతుంది. ఏడాది కాలం నుంచి శింబు జంపం మ‌ళ్లీ మొదైలంది. అంత‌కు ముందు వ‌ర‌కూ వ‌రుస ప్లాప్ ల‌తో ఇబ్బంది ప‌ట్టాడు. చేసిన ప్ర‌తీ సినిమా ప్లాప్. మ‌రోవైపు విమ‌ర్శ‌లు. వీట‌న్నింటి న‌డుమ కెరీర్ ని సాగించాల్సిన ప‌రిస్థితులు.

హీరోగా అత‌డి ప‌నైపోయింద‌ని  కోలీవుడ్ క‌థ‌నాలు అంత‌కంత‌కు హీటెక్కించాయి. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో మానాడు కి క‌మిట్ అవ్వ‌డం శింబుకి ట‌ర్నింగ్ పాయింట్ లా నిలిచింది.  సినిమా విజ‌యంతో మ‌రోసారి హాట్ టాపిక్ అయ్యారు.  కొత్త అవ‌కాశాలు క్యూ క‌ట్టాయి. త్వ‌ర‌లో ఏకంగా స్టార్ మేక‌ర్ ముర‌గ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలోనే ఓ సినిమా చేస్తున్నాడు.

ఇది కూడా హిట్ అయితే అత‌ని రేంజ్ మారిపోతుంది. ఈనేప‌థ్యంలో తాజాగా మ‌రో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒక‌టి వైర‌ల్ గా మారింది. మానాడు చిత్రానికి  సీక్వెల్ ఉన్న‌ట్లు యూనిట్ సంకేతాలు పాస్ చేసింది.  మానాడు రిలీజ్ అయి ఏడాది పూర్త‌యిన సంద్భంగా తాజాగా సినిమాకి సంబంధించిన ఓ మేకింగ్ వీడియోని రిలీజ్ చేసారు.  అందులో 'లూప్ కంటున్యూస్ సూన్' అంటూ రివీల్ చేసారు.

అంటే 'మానాడు' కి సీక్వెల్ చేస్తున్న‌ట్లు  చెప్ప‌క‌నే చెప్పారు. అయితే ఈసీక్వెల్ లో హీరో ఎవ‌రు?  ద‌ర్శ‌కుడు ఎవ‌రు? అన్న‌ది ఎక్క‌డా లీక్ చేయ‌లేదు. కేవ‌లం సీక్వెల్ ఉంటుంద‌ని మాత్రమే హింట్ ఇచ్చారు. మొద‌టి భాగానికి వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌రు. ప్ర‌తి నాయ‌కుడిగా ఎస్. జె సూర్య నటించారు. మ‌రి  సీక్వెల్ బాధ్య‌త‌లు కూడా  వెంక‌ట్ ప్రభు తీసుకుంటారా?  లేక కొత్త వాళ్లు వ‌స్తారా?  అలాగే శింబునే హీరోగా  చేస్తాడా? వంటి వివ‌రాలు తెలియాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News