టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. ప్రస్తుతం ఉక్రెయిన్ లో చిత్రీకరణ జరుపుతున్నారు. అక్కడ రెండు పాటల చిత్రీకరణతో షూటింగ్ పూర్తి అవుతుంది. ఈ నెలలోనే ఇండియాకు తిరిగి రాబోతున్న చిత్ర యూనిట్ సభ్యులు సినిమా ప్రమోషన్ లో బిజీ అవ్వబోతున్నారు. అక్టోబర్ లో సినిమాను విడుదల చేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నారు. సినిమా విడుదలకు కనీసం నెల రోజుల నుండే పెద్ద ఎత్తున సోషల్ మీడియాతో పాటు అన్ని మీడియాల్లో కూడా సందడి చేసే విధంగా ప్రమోషన్ ను మొదలు పెట్టబోతున్నారు.
సెప్టెంబర్ నెల మొత్తం ఆర్ ఆర్ ఆర్ టీమ్ చేయబోతున్న సందడితో మీడియా హడావుడి కనిపించబోతుంది. ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ నుండి దోస్తీ సాంగ్ వచ్చిన విషయం తెల్సిందే. ఆ మ్యూజిక్ వీడియో ఇద్దరు హీరోలకు సంబంధించిన పాత్రలను పరిచయం చేయడంతో పాటు ఇద్దరి మద్య స్నేహంను చూపించే విధంగా ఉంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన మరో ప్రమోషనల్ సాంగ్ కు తుది మెరుగులు దిద్దుతున్నారు. సెప్టెంబర్ లో సినిమా పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
కీరవాణి సంగీత సారథ్యంలో రూపొందిన ఆ పాటలో చిత్రంలో నటించిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు కూడా కనిపించబోతున్నారట. మేకింగ్ వీడియో తరహాలో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల్లో షూట్ ను ఎలా చేశారనే విషయాన్ని రఫ్ గా చూపిస్తూ ఆ ప్రమోషనల్ సాంగ్ సాగుతుందట. మరోసారి ఆ పాటతో కీరవాణి అలరించడం ఖాయం అంటున్నారు. సినిమా స్థాయిని పెంచే విధంగా ఆ పాట ఉండేలా ఎడిటింగ్ చేయిస్తున్నారు. దోస్తీ సాంగ్ బాధ్యత పూర్తిగా రాజమౌళి తనయుడు కార్తికేయ చూసుకున్నాడు. రెండవ సాంగ్ బాధ్యతలు కూడా ఆయనకే రాజమౌళి అప్పగించారని తెలుస్తోంది. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ల అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సెప్టెంబర్ నెల మొత్తం ఆర్ ఆర్ ఆర్ టీమ్ చేయబోతున్న సందడితో మీడియా హడావుడి కనిపించబోతుంది. ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ నుండి దోస్తీ సాంగ్ వచ్చిన విషయం తెల్సిందే. ఆ మ్యూజిక్ వీడియో ఇద్దరు హీరోలకు సంబంధించిన పాత్రలను పరిచయం చేయడంతో పాటు ఇద్దరి మద్య స్నేహంను చూపించే విధంగా ఉంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన మరో ప్రమోషనల్ సాంగ్ కు తుది మెరుగులు దిద్దుతున్నారు. సెప్టెంబర్ లో సినిమా పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
కీరవాణి సంగీత సారథ్యంలో రూపొందిన ఆ పాటలో చిత్రంలో నటించిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు కూడా కనిపించబోతున్నారట. మేకింగ్ వీడియో తరహాలో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల్లో షూట్ ను ఎలా చేశారనే విషయాన్ని రఫ్ గా చూపిస్తూ ఆ ప్రమోషనల్ సాంగ్ సాగుతుందట. మరోసారి ఆ పాటతో కీరవాణి అలరించడం ఖాయం అంటున్నారు. సినిమా స్థాయిని పెంచే విధంగా ఆ పాట ఉండేలా ఎడిటింగ్ చేయిస్తున్నారు. దోస్తీ సాంగ్ బాధ్యత పూర్తిగా రాజమౌళి తనయుడు కార్తికేయ చూసుకున్నాడు. రెండవ సాంగ్ బాధ్యతలు కూడా ఆయనకే రాజమౌళి అప్పగించారని తెలుస్తోంది. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ల అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.