బిగ్‌బాస్ ట్విస్ట్: నామినేషన్లో నలుగురు... ఎలిమినేట్

Update: 2019-10-26 04:57 GMT
కంటెస్టంట్స్‌కు అర్ధం కావడం లేదు. బిగ్ బాస్ ఊహించని షాకులు ఇస్తూ ఇంటి సభ్యులకు చుక్కలు చూపిస్తున్నారు. శుక్రవారం ఎపిసోడ్లో కంటెస్టంట్స్ ని అర్ధరాత్రి లేపి బిగ్‌బాస్ ఓ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. అప్పటివరకు బోరుగా సాగిన బిగ్‌బాస్ షో ఆసక్తికరంగా సాగడం మొదలైంది. అర్థరాత్రి సభ్యులని సైరన్ తో లేపి నామినేషన్ లో ఉన్నవారు లగేజ్ సర్దుకుని గార్డెన్ ఏరియాలోకి రావాలని సూచించాడు.

ఆ తర్వాత నామినేషన్లో ఉన్నవారిని పోడియం మీద నిల్చుని తమ బిగ్‌బాస్ జర్నీ గురించి చెప్పాలని కోరాడు. అందరూ తమ జర్నీ గురించి మాట్లాడారు. నెక్ట్స్‌ ప్రేక్షకుల తీర్పు వచ్చిందని బిగ్‌బాస్ షాక్ ఇచ్చారు. ఐదుగురు సభ్యుల మీద లైట్లు వేస్తూ... చివరికి బాబా భాస్కర్ మీద గ్రీన్ లైట్ వేశారు.  దీంతో బాబాకు ప్రేక్షకులు ఓటు వేసి సేవ్ చేశారని, ఆయన టికెట్ టు ఫినాలే గెలుచుకుని టాప్-5లోకి వెళ్లారని ప్రకటించారు. మిగతా నలుగురు తీర్పుని వీకెండ్ లో నాగార్జున చెబుతారని అన్నారు.

అయితే బాబా సేఫ్ కావడంతో.... నామినేషన్లో శ్రీముఖి, అలీ, వరుణ్, శివజ్యోతి ఉన్నారు. ఈ నలుగురులో ముగ్గురు సేవ్ అయ్యి.. ఒక్కరు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోనున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారమైతే శ్రీముఖి, వరుణ్ సేవ్ అవ్వడం ఖాయమని అర్ధమవుతోంది. ఇక మిగిలిన అలీ, శివజ్యోతిలో ఒకరు ఖచ్చితంగా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతారని తెలుస్తోంది. వీకెండ్ లో ఈ ఇద్దరిలో ఎవరు ఇంటి నుంచి బయటకు వెళతారో ?  చూడాలి.
Tags:    

Similar News