ఈ సారి 'పుష్ప‌' ఊ.. అనిపిస్తోంది ఎవ‌రితో?

Update: 2022-03-19 03:30 GMT
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `పుష్ప ది రైజ్‌` గ‌త ఏడాది డిసెంబ‌ర్ లో విడుద‌లై దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ప్రాంతీయ చిత్రంగా విడుద‌లైన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రికార్డుల మోత మోగించింది. ఊ హించ‌ని స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి ట్రేడ్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్ప‌టికీ ఉత్త‌రాదిలో ఈ సినిమా సాధించిన వ‌సూళ్లు బాలీవుడ్ వ‌ర్గాల‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బాలీవుడ్ స్టార్స్ ని కూడా మీడియా స‌మావేశాల్లో ఈ మూవీ ప్ర‌స్తావ‌న కార‌ణంగా ఇరిటేట్ చేస్తూ నిత్యం వార్త‌ల్లో నిలుస్తోంది.

స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ - అల్లు అర్జున్ కెరీర్ లో ముచ్చ‌ట‌గా మూడ‌వ కాంబినేష‌న్ లో వ‌చ్చిన ఈ మూవీ మునుపెన్న‌డూ లేనంత‌గా ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్ గా వైర‌ల్ గా మారింది. ఈ చిత్రం కోసం ఫూమ‌స్ క్రికెట‌ర్ లు , టిక్ టాక్ స్టార్లు, స్టార్స్ ప్ర‌చార క‌ర్త‌లుగా మారి రీల్స్ చేయ‌డంతో సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఉత్త‌రాదిలో 100 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన ఈ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్ గా 300 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి సంచ‌ల‌నం సృష్టించింది.

బ‌న్నీ కెరీర్ లోనే అత్య‌ధిక వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన సినిమాగా రికార్డుని క్రియేట్ చేసింది. అంతే కాకుండా బ‌న్నీని ప్ర‌భాస్ త‌రువాత పాన్ ఇండియా స్టార్ గా నిల‌బెట్టింది. దీంతో పార్ట్ 2 పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఆ అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌ని స్థాయిలో పార్ట్ 2 వుండాల‌ని ద‌ర్శ‌కుడు సుకుఆమ‌ర్ అప్పుడే క‌స‌ర‌త్తులు ప్రారంభించేశారు. బాలీవుడ్ లో ఎలాంటి ప్ర‌చారం చేయ‌క‌పోయినా.. బ‌న్నీ ప్ర‌త్య‌క్ష్యంగా బాలీవుడ్ లో ప్ర‌చారం చేయ‌క‌పోయినా ఈ మూవీ అక్క‌డ 100 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని కాబ‌ట్టింది.

దీంతో ఉత్త‌రాది ప్రేక్ష‌కుల‌ని దృష్టిలో పెట్టుక‌ని సుకుమార్ పార్ట్ 2 `పుష్ప ది రూల్‌` లో భారీ మార్పులు చేయ‌డం మొద‌లు పెట్టార‌ట‌. అంతే కాకుండా బాలీవుడ్ బాధ్య‌త‌ల్ని స్టార్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ కి అప్ప‌గించార‌ని వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వార్త ఒక‌టి తాజాగా బ‌య‌టికి వ‌చ్చింది. ఈ చిత్రంలో తొలిసారి స‌మంత `ఊ అంటావా మావ ఊహూ అంటావా..` అంటూ  ఐట‌మ్ సాంగ్ లో కేక పెట్టించిన విష‌యం తెలిసిందే.

ఈ పాట‌లో `పుష్ప‌` క్రేజ్ మ‌రింత పీక్స్ కి చేరింది. స‌మంత ప్ర‌త్యేకంగా హాట్ హాట్ గా న‌టించ‌డంతో సినిమాకు ప్ల‌స్ అయింద‌న్న విష‌యం తెలిసిందే. అయితే `పుష్ప ది రూల్‌`కి వ‌చ్చే స‌రికి ఈ త‌ర‌హాలో సినిమాకు జోష్ ని అందించే మ‌రో సాంగ్ ని కూడా సుకుమార్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే పాన్ ఇండియా రేంజ్ లో సినిమాపై అంచ‌నాలు పెరిగిపోవ‌డంతో ఆ స్థాయిలో క్రేజ్ వున్న బాలీవుడ్ న‌టిని ఈ పాట కోసం తీసుకునే ఆలోచ‌న‌లో టీమ్ వుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

గ‌తంలో `ఊ అంటావా.. `పాట కోసం బాలీవుడ్ హాట్ బ్యూటీ దిషా ప‌టానిని తీసుకుంటార‌ని ప్ర‌చారం జ‌రిగింది. మ‌రి ఈ సారి అయినా ఆమెని ట్రై చేసి పార్ట్ 2ని మేక‌ర్స్ మ‌రింత హీటెక్కించేస్తారో చూడాలి అంటున్నారు అభిమానులు
Tags:    

Similar News