కుర్ర విలన్‌ వ్యాఖ్యలతో ఆర్ సీ 15 అంచనాలు పీక్స్‌ కి

Update: 2022-07-21 03:30 GMT
ఆర్ ఆర్ ఆర్‌ తర్వాత రామ్‌ చరణ్ ఆచార్య సినిమా తో వచ్చాడు. ఆ సినిమా లో గెస్ట్‌ రోల్‌ లో కనిపించిన నేపథ్యంలో తదుపరి ఫుల్ లెంగ్త్‌ హీరో పాత్ర సినిమా కోసం అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు.

ఆర్ ఆర్‌ ఆర్‌ కు ఏమాత్రం తగ్గకుండా దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్‌ చరణ్ హీరోగా ఒక సినిమా రూపొందుతోంది. బ్యాక్‌ టు బ్యాక్ భారీ షెడ్యూల్స్ తో సినిమా ను చకచక ముగించే ప్రయత్నాలు చేస్తున్నారు.

దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ను వచ్చే ఏడాది ప్రథమార్థం లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. హీరోయిన్ గా ఈ సినిమా లో కియారా అద్వానీ నటిస్తున్న విషయం తెల్సిందే. అంజలి కీలక పాత్రలో నటిస్తుండగా ఈ మధ్య కాలంలో కుర్ర విలన్ గా మంచి పేరు దక్కించుకుంటున్న నవీన్ చంద్ర కూడా కీ రోల్‌ లో ఆర్ సీ 15 లో నటిస్తున్నాడట.

నవీన్ చంద్ర నటించిన పరంపర వెబ్‌ సిరీస్ సీజన్ 2 స్ట్రీమింగ్‌ సందర్బంగా మీడియా తో మాట్లాడాడు. వెబ్ సిరీస్ కు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమంలో ఆర్‌ సీ 15 గురించి నవీన్ చంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రామ్‌ చరణ్.. శంకర్ ల కాంబో సినిమా ఏ ఒక్కరూ ఊహించని విధంగా ఉంటుంది. శంకర్ గారు విభిన్నమైన ప్రపంచం లోకి జనాలను తీసుకు వెళ్లబోతున్నారు.

సినిమా కథను కాని కాన్సెప్ట్‌ ను కాని ఎవరూ ఊహించని రేంజ్ లో శంకర్‌ చూపిస్తారని నవీన్ చంద్ర అన్నారు. అంతే కాకుండా ఈ సినిమా రామ్‌ చరణ్ అభిమానులకు గొప్ప విందు అన్నట్లుగా ఉంటుందని ఆయన పేర్కొన్నాడు. సినిమా లోని తన పాత్ర విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేను అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.

ఇది ఒక పొలిటికల్‌ బ్యాక్ డ్రాప్ మూవీ అన్నట్లుగా చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. రామ్‌ చరణ్ ఈ సినిమా లో ద్వి పాత్రాభినయం చేస్తున్నాడు. తండ్రి కొడుకులుగా మొదటి సారి చరణ్‌ రెండు పాత్రల్లో కనిపించబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలు పెంచే విధంగా నవీన్ చంద్ర యొక్క వ్యాఖ్యలు ఉన్నాయి.
Tags:    

Similar News