హాలోవీన్ డే: దెయ్యాల్లా మారిన మన స్టార్స్

Update: 2021-11-01 08:58 GMT
హాలోవీన్ డే.. అమెరికా, యూకే వంటి పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇప్పుడు ఈ ట్రెండ్ భారతదేశంలోనూ వచ్చేసింది. ప్రతీ ఏడాది అక్టోబర్ 31న హాలోవీన్ ఫెస్టివల్ ను సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ సందర్భంగా దెయ్యాల్లా విచిత్ర వేషధారణతో రెడీ అయ్యి ఫ్రెండ్స్ తో సందడి చేస్తారు.

హాలోవీన్ ఫెస్టివల్ అంటూ పలువురు స్టార్స్ దెయ్యాల్లా రెడీ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి మొదలుపెడితే మెగా డాటర్ నిహారిక-చైతన్య దంపతులు సైతం దెయ్యాల్లా మారి భయపెట్టారు.

అక్టోబర్ 31న హాలోవీన్ డేను పురస్కరించుకొని నిహారిక తన భర్త చైతన్యతో కలిసి దెయ్యం గెటప్ లో ప్రత్యక్షమైంది. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఒకప్పుడు హాలోవీన్ పండుగను విదేశాల్లో మాత్రమే జరుపుకునే వారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచమంతా కుగ్రామమైంది. దీంతో హాలోవీన్ ను మన దేశంలో కూడా జరుపుకుంటున్నారు.

ఈ పండుగ ప్రత్యేకత ఏంటంటే భయానక దుస్తుల్లో కనిపించడం.. ఆత్మల లోకం.. మన ప్రపంచం మధ్య ఉన్న గోడ బలహీనంగా మారినప్పుడు దుష్టశక్తులు భూమిపైకి వచ్చి మానవాళికి హాని కలిగిస్తాయనే ప్రచారం ఉంది.

ఈ క్రమంలోనే హాలోవీన్ సందర్భంగా సెలబ్రెటీలంతా దెయ్యాల్లా మారి సంబంధిత ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఈ సంప్రదాయాన్ని తాజాగా నిహారిక, భర్తతో కలిసి చేసింది. దెయ్యాల గెటప్ తో ఈ జంట అలరించింది. ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి.



Tags:    

Similar News