పెళ్లి కాక‌ముందే టెన్ష‌న్ పెడుతున్న జంట‌!

Update: 2021-12-30 02:30 GMT
బాలీవుడ్ ల‌వ్ క‌పుల్ సిద్ధార్థ్ మల్హోత్రా -కియారా అద్వానీ డేటింగ్ లో ఉన్నార‌ని పుకార్లు షికార్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మ మ‌ధ్య అనుబంధాన్ని ఈ జంట ఏనాడూ అధికారికంగా ధృవీక‌రించ‌లేదు. అయితే గ‌త ఏడాది ఎవ‌రికి వారు విడివిడిగా మాల్దీవుల‌కు వెళ్లి తిరిగి వ‌చ్చేప్పుడు క‌లిసే రావ‌డంతో విమానాశ్ర‌యంలో కెమెరా కంటికి చిక్కిన సంగ‌తి తెలిసిందే. నూత‌న సంవ‌త్సరం 2021 వేడుక‌ల్లో భాగంగా ఈ జంట ఒంట‌రి దీవుల‌కు ఎగిరిపోయిందంటూ అభిమానుల్లో ప్ర‌చార‌మైంది.

ఇప్పుడు 2022 నూతన సంవత్సర వేడుకలను సిద్ధార్థ్ - కియ‌రా జోడీ గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేయ‌నున్నారు. ఆ ఇద్ద‌రూ క‌లిసి నేడు గుర్తు తెలియని దూరా తీరాల‌కు వెకేష‌న్ కోసం బయలుదేరారు. ముంబై విమానాశ్రయంలో ఈ జంట కెమెరా కంటికి చిక్కింది. సిద్ధార్థ్- కియారా అరైవల్ గేట్ వద్ద చేతులు ఊపుతూ అభిమానుల‌కు క‌నిపించారు. కియారా వైట్ బూట్స్ కి పింక్ ఓవర్ సైజ్ స్వెట్ ష‌ర్ట్ డ్రెస్ తో క్యాజువల్ లుక్ లోకి మారింది. సిద్ధార్థ్ బ్లాక్ ప్యాంట్ తో పాటు ఆలివ్ గ్రీన్ జాకెట్ లో ఎంతో స్పెష‌ల్ గా క‌నిపించాడు.

సిధ్- కియ‌రా జంట‌ తమ సంబంధాన్ని ధృవీకరించలేదు కానీ ఈ జంట‌ ఆఫ్ ద స్క్రీన్ రొమాన్స్ తో అభిమానులను ఆనందపరుస్తూనే ఉన్నారు. కియారా అద్వానీ - సిద్ధార్థ్ మల్హోత్రా ఫోటోలు వీడియోలు వైరల్ అయిన వెంటనే ఈ జంట‌ అభిమానులు చాలా హాట్ గా క‌నిపించారు. ``జంట బావుంది. చాలా అందంగా ఉన్నారు. షేర్షా దేఖ్నే కే బాద్ సే తో యే దోనో ఔర్ ప్యారే లగ్నే లగే హైన్ (షేర్షాను చూసిన తర్వాత నేను వారితో కలిసి మరింత అందంగా ఉన్నట్లు కనుగొన్నాను. వారు ఎప్పటికీ విడిపోరని నేను ఆశిస్తున్నాను`` అంటూ అభిమాని ఆనందం వ్య‌క్తం చేశారు.

ఈ సీజ‌న్ బెస్ట్ హిట్స్ లో సిద్ధార్థ్ -కియారా జంట‌గా న‌టించిన దేశ‌భ‌క్తి చిత్రం `షేర్షా` గొప్ప పేరు తెచ్చింది. ఈ జోడీ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అభిమానులకు నచ్చింది. జంట‌గా అందరి హృదయాలను గెలుచుకోవడమే కాదు.. వారి మ‌ధ్య రొమాన్స్ భావోద్వేగాలు మూవీకి ప్రధాన హైలైట్ లలో ఒకటిగా మారాయి. అన్ని వైపుల నుంచి ఈ జంట‌ ప్రశంసలను ద‌క్కించుకున్నారు. పరమవీర చక్ర అవార్డు గ్రహీత కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవిత‌క‌థ‌ ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో సిద్ధార్థ్ ద్విపాత్రాభినయం చేయగా.. కియారా భార్య‌ డింపుల్ చీమా పాత్రను పోషించింది.

1999లో కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ చొరబాటుదారుల నుండి భారత భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకునే సమయంలో కెప్టెన్ విక్రమ్ బాత్రా దేశ సేవలో విరోచిత పోరాటంలో తన ప్రాణాలను అర్పించారు. అతని అపారమైన ధైర్యసాహసాల కారణంగా అతనికి షేర్ షా (సింహం రాజు) అనే బిరుదు లభించింది. విష్ణు వర్ధ‌న్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ధర్మ ప్రొడక్షన్స్ -కాష్ ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మించారు. షేర్షాలో నటులు శివ్ పండిట్- రాజ్ అర్జున్- ప్రణయ్ పచౌరి- హిమాన్షు అశోక్ మల్హోత్రా- నికితిన్ ధీర్- అనిల్ చరణ్ జీత్- సాహిల్ వైద్- షతాఫ్ ఫిగర్-పవన్ చోప్రా కూడా న‌టించారు.


Tags:    

Similar News