జాన్వీ ఈ సారైనా మాట మీద నిల‌బ‌డుతుందా?

Update: 2022-11-01 23:30 GMT
జాన్వీ క‌పూర్ వ్య‌వ‌హారం నాన్నా పులి క‌థ‌లా మారుతోంది. మ‌రాఠీలో సంచ‌ల‌నం సృష్టించిన 'సైరాఠ్‌' రీమేక్ ఆధారంగా తెర‌కెక్కిన 'ధ‌డ‌క్‌' మూవీతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన జాన్వీ క‌పూర్ ఆ త‌రువాత నుంచి టాలీవుడ్ సినిమాల్లో న‌టించాల‌ని వుంద‌ని చెబుతోందే కానీ అందుకు త‌గ్గ‌ట్టుగా అడుగులు వేయ‌డం లేదు. తండ్రి బోనీ క‌పూర్ త‌లుచుకుంటే జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ అన్న‌ది చిటికెలో ప‌ని. కానీ అది జ‌ర‌గ‌డం లేదు.

చాలా మంది బాలీవుడ్ హీరోయిన్స్ సౌత్ స్టార్స్ తో న‌టించాల‌ని వుంద‌ని చెబుతున్నారు.. దాన్ని ప్రాక్టిక‌ల్ గా నిజం చేసుకుంటున్నారు కూడా. కియారా అద్వానీ, అన‌న్య పాండే, అలియా భ‌ట్ వంటి తార‌లు ద‌క్షిణాది స్టార్స్ తో న‌టించాల‌ని వుంద‌ని ప‌లు ఇంటర్వ్యూల్లో చెప్పిన వాళ్లే.. ఆ త‌రువాత త‌మ మాట‌ల‌కు క‌ట్టుబ‌డి తెలుగు సినిమాల్లో న‌టించారు కూడా. కియారా అద్వానీ తెలుగులో భ‌ర‌త్ అనే నేను', విన‌య విధేయ రామ వంటి సినిమాల్లో న‌టించింది.

ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ - శంక‌ర్ ల క‌ల‌యిక‌లో రూపొందుతున్న RC15 లో న‌టిస్తోంది. రీసెంట్ గా అన‌న్య పాండే 'లైగ‌ర్‌' మూవీలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి న‌టించిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ కోసం ముందు జాన్వీ క‌పూర్ ని సంప్ర‌దించారు. కానీ ఎందుక‌నో జాన్వీ ఈ ప్రాజెక్ట్ లో న‌టించ‌లేక‌పోయింది. ఆ త‌రువాత టాలీవుడ్ నుంచి చాలా మంది డైరెక్ట‌ర్స్, ప్రొడ్యూస‌ర్స్ ట్రై చేస్తున్నా జాన్వీ క‌పూర్ మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క తెలుగు సినిమాకు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేదు.  

ఇదిలా వుంటే తాజాగా ఎన్టీఆర్ తో క‌లిసి న‌టించాల‌నే కోరిక‌ను బ‌య‌ట‌పెట్టింది జాన్వీ క‌పూర్‌. త‌ను న‌టిస్తున్న తాజా చిత్రం 'మిలీ'. స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న ఈ మూవీ న‌వంబ‌ర్ 4న విడుద‌ల కాబోతోంది. ఇందులో భాగంగా ప్ర‌మోష‌న్స్ లో పాల్గొంటున్న జాన్వీ క‌పూర్ టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. త్వ‌ర‌లో సౌత్ సినిమాలో న‌టించాల‌నే ఆలోచ‌న‌లో వున్నారా? అని అడిగితే తాను సౌత్ సినిమాలు చూస్తూ పెరిగాన‌ని, నిజంగా సౌత్ సినిమాల్లో న‌టించే అవ‌కాశం పొందాల‌నుకుంటున్నాన‌ని వెల్ల‌డించింది.

మ‌రి సౌత్ లో ఎవ‌రితో క‌లిసి న‌టించాల‌ని వుంద‌ని అడిగితే వెంట‌నే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అని చెప్పేసింది. త‌న‌తో క‌లిసి న‌టించాల‌ని ఎదురుచూస్తున్న‌ట్టుగా జాన్వీ వెల్ల‌డించింది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న 30వ ప్రాజెక్ట్ ని కొర‌టాల శివ‌తో చేస్తున్న విష‌యం తెలిసిందే. త్వ‌ర‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మూవీలో ఎన్టీఆర్ కు జోడీగా అలియా భ‌ట్ త‌రువాత జాన్వీ క‌పూర్ పేరు వినిపిస్తోంది. త‌న‌తో చిత్ర బృందం చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో జాన్వీ .. ఎన్టీఆర్ తో క‌లిసి ప‌ని చేయాల‌ని వుంద‌ని చెప్ప‌డంతో ఆ వార్త‌ల‌కు బ‌లం చేకూరుతోంది. అయితే  తెలుగు ఆడియ‌న్స్ మాత్రం గ‌త కొంత కాలంగా ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లే చేస్తున్న జాన్వీ అన్న‌మాట‌పై నిల‌బ‌డి ఎన్టీఆర్ సినిమాతో టాలీవుడ్ లోకి అరంగేట్రం చేస్తుందా? అని కామెంట్ లు చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News