అర్షద్ వార్సీపై బోనీ క‌పూర్ సెటైర్లు!

ఇప్పుడు టార్గెట్ నేను అయ్యాను. మేము కాకుండా అత‌నికి అంత పెద్ద మొత్తంలో పారితోషికం ఎవ‌రిచ్చారు?

Update: 2024-08-23 20:30 GMT

బాలీవుడ్ న‌టుడు అర్ష‌ద్ వార్సీ పేరు ఇటీవ‌ల టాలీవుడ్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారిన సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ న‌టించిన క‌ల్కీ లో డార్లింగ్ పాత్ర‌ను ఓ జోక‌ర్ తో పోలుస్తూ చేసిన వ్యాఖ్య‌ల‌పై టాలీవుడ్ మండి ప‌డింది. అర్ష‌ద్ వార్సీ వ్యాఖ్య‌ల్ని ఇండ‌స్ట్రీ ముక్త కంఠంగా ఖండించింది. ఇంత‌లోనే అర్ష‌ద్ వార్సీ నిర్మాత బోనీ క‌పూర్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు.

'రూప్ కీ రాణీ చోరోం కారాజా' సినిమా సాంగ్ కొరియోగ్ర‌ఫీ చేస్తే ల‌క్ష ఇస్తామ‌న్న వాళ్లు 75 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నార‌ని వ్యాఖ్యానించాడు. ఈ నేప‌థ్యంలో బోనీ క‌పూర్ సీన్ లోకి వ‌చ్చి ఆ వ్యాఖ్య‌ల్ని ఖండించారు. 'అంద‌రూ మీడియా అటెన్ష‌న్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇప్పుడు టార్గెట్ నేను అయ్యాను. మేము కాకుండా అత‌నికి అంత పెద్ద మొత్తంలో పారితోషికం ఎవ‌రిచ్చారు? ఆ స‌మ‌యంలో ఆయ‌న స్టార్ న‌టుడు కాదు.

పారితోషికం విష‌యంలోనూ మా మ‌ధ్య ఎలాంటి కూడా ఒప్పందం లేదు. మా నిర్మాణ సంస్థ గురించి ఆయ‌న చేసిన వ్యాఖ్యలు చూసి న‌వ్వుకున్నా. 1992 లోనే ఆ సినిమా నిర్మించాం. కానీ ఆయ‌న ఆరోప‌ణ‌లు ఇప్పుడు చేస్తున్నాడు. ఇంత కాలం ఎందుకు మాట్లాడ‌లేదు. గ‌తంలో ఇద్ద‌రం ఓ టీవీ షోలో కూడా పాల్గొన్నాం. అప్పుడు కూడా ఇలాంటి ఆరోప‌ణ‌లు చేయ‌లేదు. అంద‌రికీ మీడియా అటెన్ష‌న్ కావాలి. ఇప్పుడు నేను సాప్ట్ టార్గెట్ అయ్యాను' అని అన్నారు.

మొత్తానికి అర్ష‌ద్ వార్సీ పేరు నెట్టింట జోరుగా వైర‌ల్ అవుతుంది. మొన్న ప్రభాస్ ..ఇప్పుడు బోనీ క‌పూర్.. నెక్స్ట్ ఎవ‌రు? అంటూ అర్ష‌ద్ వార్సీని ట్రోల్ చేస్తున్నారు. అర్ష‌ద్ వార్సీకి బాలీవుడ్ న‌టుడిగా మంచి గుర్తింపు ఉన్న సంగ‌తి తెలిసిందే. దాదాపు నాలుగు ద‌శాబ్దాలుగా ఇండస్ట్రీలో కొన‌సాగుతున్నారు.

Tags:    

Similar News