గ్యాంగ్ లీడ‌ర్ రోజులు మ‌ళ్లీ వ‌చ్చాయ్ బాసూ!

అయితే ఈ వీడియోలో మెగాస్టార్ లుక్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. 'బాస్ ఈజ్ బ్యాక్' అనే రేంజులో చిరు యంగ్ లుక్ లో క‌నిపించారు.

Update: 2024-08-06 17:02 GMT

నటి-నిర్మాత నిహారిక కొణిదెల నిర్మించిన‌ తాజా చిత్రం 'కమిటీ కుర్రోళ్లు' ఆగష్టు 9న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ గత రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఓ ప్రత్యేక వీడియోలో చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

అయితే ఈ వీడియోలో మెగాస్టార్ లుక్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. 'బాస్ ఈజ్ బ్యాక్' అనే రేంజులో చిరు యంగ్ లుక్ లో క‌నిపించారు. ఆయ‌న హెయిర్ స్టైల్, బాడీ లాంగ్వేజ్ కూడా మునుప‌టి రోజుల‌ను గుర్తు చేస్తోంది. ఈ కొత్త రూపం చూసాక గ్యాంగ్ లీడ‌ర్, రౌడీ అల్లుడు రోజులు మ‌ళ్లీ వ‌చ్చాయ్! అంటూ మెగాభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.

నిహారిక నిర్మించిన 'కమిటీ కుర్రోళ్లు' చిత్రానికి బాస్ ప్ర‌మోష‌న్ పెద్ద‌గానే క‌లిసొస్తోంది. చిరు ఈ సినిమాపై ప్ర‌శంస‌లు కురిపించారు. చిరు మాట్లాడుతూ-''నేను ఇప్పటికే సినిమా చూశాను.. బాగా ఆకట్టుకుంది. నిహారిక బహుముఖ ప్రజ్ఞాశాలిని. మంచి ఆర్టిస్ట్‌గానే కాకుండా లేటెస్ట్ ట్రెండ్స్‌కు తగ్గట్టుగా సినిమాలను కూడా నిర్మిస్తోంది. తెలుగు ప్రేక్షకులు ఎల్లప్పుడూ ఫ్రెష్‌నెస్ ఉన్న‌ ఉత్తేజకరమైన కంటెంట్‌ను చూస్తారు..ప్రోత్సహిస్తారు. కమిటీ కుర్రోళ్లు కథ గోదావరి జిల్లాలో పదకొండు మంది యువకుల గురించి. ఈ చిత్రం కొత్త త‌రం ప్రతిభావంతుల ప్రతిభకు కష్టానికి ప్రతిఫలం ఇస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. టీమ్ మొత్తానికి, ముఖ్యంగా నిహారికకు శుభాకాంక్షలు'' అని చిరు వీడియోలో పేర్కొన్నారు.

నూతన దర్శకుడు యదు వంశీ, సినిమాటోగ్రాఫర్ రాజు, సంగీత స్వరకర్త అనుదీప్ దేవ్‌లను కూడా చిరు అభినందించారు. నిహారిక తల్లి పద్మజ కొణిదెల సహకారంతో శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్‌పై జయలక్ష్మి అడపాక కమిటీ కుర్రోళ్లు సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సీనియ‌ర్ న‌టుడు సాయికుమార్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు.

Full View
Tags:    

Similar News