యాత్ర 2.. చూడు నాన్న!

వైఎస్ మరణాంతరం ఆయన కొడుకుగా జగన్ ప్రజల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చి ఓదార్పు యాత్ర చేపట్టారు

Update: 2024-01-19 07:17 GMT

వైఎస్ మరణాంతరం ఆయన కొడుకుగా జగన్ ప్రజల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చి ఓదార్పు యాత్ర చేపట్టారు. అప్పటి నుంచి 2019లో జగన్ ముఖ్యమంత్రి అయ్యే వరకు జరిగే కథతో యాత్ర2 చిత్రాన్ని మహి వి రాఘవ తెరకెక్కిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన యాత్రకి సీక్వెల్ గా ఈ మూవీ సిద్ధమవుతోంది. తమిళ్ యాక్టర్ జీవ వైఎస్ జగన్ పాత్రలో నటించారు.


ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చేనందుకు దర్శకుడు సిద్ధం అవుతున్నారు. వి సెల్యులాయిడ్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్ ఆకట్టుకుంది. అలాగే సాంగ్స్ కూడా మెప్పించాయి. తాజాగా చూడు నాన్న అంటూ సాగే మెలోడియస్ సాంగ్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ఓదార్పు యాత్రతో ప్రజల్లోకి వెళ్లి తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలని ఓదార్చారు.

ఏ నేపథ్యంలోనే తండ్రిని, ఆయన జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ తండ్రి మీద ప్రజాభిమానాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ జగన్ భావోద్వేగానికి గురైనట్లు ఈ సాంగ్ లో చూపించారు. చూడు నాన్న అంటూ సాగే ఈ పాతని బాస్కరపట్ల రాయగా సంతోష్ నారాయణన్ స్వరపరిచారు. విజయ్ నరేన్ ఈ పాటని ఆలపించారు. యాత్రలో సాంగ్స్ తో మహి వి రాఘవ అందరిని భావోద్వేగానికి గురి చేశాడు.

అలాగే ఈ సాంగ్ కూడా వైఎస్ఆర్ అభిమానుల మనసులకి తాకే విధంగా ఉంది. అలాగే రెగ్యులర్ ఆడియన్స్ కి కూడా సాంగ్ బాగా కనెక్ట్ అవుతోంది. ఎమోషనల్ గా సాగే సాంగ్ కావడంతో ఎక్కువ మందికి చేరువ అయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఇక ఈ సాంగ్ ని వైసీపీ ఫాలోవర్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

యాత్ర మూవీ అయితే 2019 ఎన్నికలకి ముందు రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. దానికి సీక్వెల్ గా జగన్ జర్నీతో వస్తోన్న యాత్ర2 కూడా ఆకట్టుకుంటుందని వైసీపీ ఫాలోవర్స్ బలంగా నమ్ముతున్నారు. మరి వారి ఎక్స్ పెక్టేషన్స్ ఏ మేరకు అందుకుంటుంది అనేది చూడాలి.

Full View
Tags:    

Similar News