మరోసారి UVతో సంతోష్ శోభన్.. కపుల్ ఫ్రెండ్లీ అంటూ!

కపుల్ ఫ్రెండ్లీ మూవీతో అశ్విన్ చంద్రశేఖర్.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయం కానున్నారు.

Update: 2024-07-12 09:26 GMT

రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో అలరిస్తున్నారు టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్. సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు మాత్రం తెచ్చుకున్నారు. ఇంట్రెస్టింగ్ కాన్సెప్టులతో తెరకెక్కే సినిమాలను ఎంచుకుంటూ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నారు. క్షణం ఖాళీ లేకుండా పెద్ద పెద్ద బ్యానర్లతో వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు చేతిలో అనేక ప్రాజెక్టులతో బిజీ గా ఉన్నారు.

తాజాగా సంతోష్ శోభన్ కొత్త మూవీ అనౌన్స్మెంట్ వచ్చింది. ఆయన బర్త్ డే సందర్భంగా.. కపుల్ ఫ్రెండ్లీ పేరుతో సినిమాను అనౌన్స్ చేస్తూ స్పెషల్ విషెస్ తెలిపింది ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్. ఇప్పటికే ఈ బ్యానర్ పై ఏక్ మినీ క‌థ‌, క‌ల్యాణం క‌మ‌నీయం చిత్రాలను చేసిన సంతోష్ శోభన్.. ఇప్పుడు మరోసారి వర్క్ చేస్తున్నారు. ఆయన బర్త్ డే స్పెషల్ గా కపుల్ ఫ్రెండ్లీ మూవీ టైటిల్ పోస్టర్ తోపాటు గ్లింప్స్ కూడా విడుదల చేశారు.

కపుల్ ఫ్రెండ్లీ మూవీతో అశ్విన్ చంద్రశేఖర్.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయం కానున్నారు. మిస్ ఇండియా మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తున్నారు. అశోక్ గ‌ల్లా హీరోగా తెరకెక్కుతున్న దేవ‌కీ నంద‌న వాసుదేవ‌లో హీరోయిన్ గా నటిస్తున్న ఆమె.. ఇప్పుడు రెండో చిత్రం చేస్తున్నారు. లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రాబోతున్న కపుల్ ఫ్రెండ్లీ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

కపుల్ ఫ్రెండ్లీ మూవీ టైటిల్ పోస్టర్ సింపుల్‌ గా ఉంటూనే ఆకట్టుకుంటోంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నంబర్ ప్లేట్లు ఉన్న బైక్‌ లు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. చెన్నై సెంట్రల్ స్టేషన్ దగ్గరలోని ఓ రెసిడెన్షియల్ ఏరియాను చూపించారు మేకర్స్. చెన్నై బ్యాక్ డ్రాప్ లో కపుల్ ఫ్రెండ్లీ మూవీ సాగబోతున్నట్లు తెలుస్తోంది. అయితే డీసెంట్ మ్యూజిక్ తో స్టార్ట్ అయిన బర్త్ డే గ్లింప్స్ లో సంతోష్ శోభన్.. డాబాపై పడుకుని లేచినట్లు చూపించారు.

ఆ తర్వాత కిచెన్ లో టిఫిన్ తింటున్నట్టు చూపించి హీరో లుక్ ను రివీల్ చేశారు. ఆడియెన్స్ మెచ్చే అంశాలతో ఈ మూవీ ఉండ‌బోతున్న‌ట్లు గ్లింప్స్ చూస్తుంటే అర్థ‌మ‌వుతోంది. ప్రస్తుతం గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ఆదిత్య రవీంద్రన్ సంగీతం అందిస్తుండగా.. దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సమర్పిస్తుండగా.. యూవీ కాన్సెప్ట్స్ నిర్మిస్తోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా 2025 ఫిబ్రవరి 14వ తేదీన కానున్న ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.

Full View
Tags:    

Similar News