ఆ సినిమా కి థ‌ర్డ్ పార్ట్ 2027 లో!

ఇటీవ‌ల రిలీజ్ అయిన కోలీవుడ్ హార‌ర్ థ్రిల్ల‌ర్ `డిమోంటీ కోల‌నీ-2` ఎలాంటి విజ‌యం సాధించిందో తెలిసిందే.

Update: 2024-08-30 03:00 GMT

ఇటీవ‌ల రిలీజ్ అయిన కోలీవుడ్ హార‌ర్ థ్రిల్ల‌ర్ `డిమోంటీ కోల‌నీ-2` ఎలాంటి విజ‌యం సాధించిందో తెలిసిందే. త‌మిళ్ కంటే తెలుగులో మ‌రింత హిట్ చిత్రంగా నిలిచింది. క‌థ‌నం క‌న్ ప్యూజ‌న్ కి గురిచేసినా? హార‌ర్ ప్రేక్ష‌కులు మెచ్చిన చిత్రంగా నిలిచింది. ఇక ఈ క‌థ‌కి కొన‌సాగింపుగా థ‌ర్డ్ పార్ట్ కూడా ఉంద‌ని హింట్ ఇచ్చేసారు. మ‌రి అదెప్పుడు? అంటే 2027 లో అని తెలుస్తోంది.

`డీమోంటీ కాల‌నీ లో హ‌త్య‌కు కార‌ణం ఏంటి? అన్న‌ది రెండ‌వ పార్ట్ లో క్లియ‌ర్ గా రివీల్ చేసారు. థ‌ర్డ్ పార్ట్ లో ఆ దృష్ట శ‌క్తితో పోరాటం పీక్స్ లో ఉంటుంద‌ని తెలుస్తోంది. దానికి ముగింపును ఓ గ‌దిలో అయితే క‌థ మొద‌ల‌వుతుందో? అదే గ‌దిలో ముగింపు ఉంటుంద‌ని మెయిన్ లీడ్ పోషించిన అరుళ్నిధి క్లైమాక్స్ లో చెప్పేసాడు. అంటే మూడ‌వ భాగంతో డీమోంటీ కాల‌నీ ప్రాంచైజీ పూర్తవుతుంది.

ఆ త‌ర్వాత ఎలాంటి కొన‌సాగింపు ఉండ‌ద‌ని ద‌ర్శ‌కుడు అజ‌య్ జ్ఞాన‌మూర్తి చెప్ప‌క‌నే చెప్పిన‌ట్లు. చ‌ని పోయిన పాత్ర‌లు మిన‌హా రెండ‌వ భాగంలో ఉన్న పాత్ర‌ల‌న్నీ మూడ‌వ భాగంలోనూ కొన‌సాగుతాయి. అద‌నంగా కొత్త పాత్రల యాడింగ్ తో థ‌ర్డ్ పార్ట్ ఉంటుంద‌ని తెలుస్తోంది. డీమోంట్ కాల‌నీ 2015 లో రిలీజ్ అయింది. కానీ రెండ‌వ భాగం రిలీజ్ చేయ‌డానికి దాదాపు తొమ్మిది సంవ‌త్స‌రాలు ప‌ట్టింది.

కానీ థ‌ర్డ్ పార్ట్ కి మాత్రం అంత స‌మ‌యం తీసుకోలేదు. మూడేళ్లు మాత్ర‌మే తీసుకుంటున్నారు. అంటే ఇప్ప‌టి నుంచి క‌థ ప‌నులు మొద‌ల‌వుతాయి. మ‌ధ్య‌లో వేర్వేరు సినిమాలు చేస్తూ స్టోరీ ప‌నుల్లో టీమ్ ప‌నిచేస్తుంది. 2027 లో చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తారు.

Tags:    

Similar News