సైలెంట్ గా పెళ్లి పీటలు ఎక్కేసిన రవితేజ డైరెక్టర్.. వైరల్ అవుతున్న ఫోటోలు..

భారీ అంచనాల మధ్య మాస్ మహారాజ్ తో తీసినా టైగర్ నాగేశ్వరరావు చిత్రం డిజాస్టర్ గా మిగలడంతో అతనికి ఊహించిన రేంజ్ గుర్తింపు దక్కలేదు.

Update: 2024-08-28 14:19 GMT

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం హీరోకి ఏ రేంజ్ క్రేజ్ ఉందో డైరెక్టర్లకి అంతకుమించి క్రేజ్ ఉంది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. అయితే కొంతమంది డైరెక్టర్లు మాత్రం ఎన్ని సినిమాలు తీసిన పెద్దగా గుర్తింపు లేకుండా మిగిలిపోతారు. అలాంటి వారిలో ఒకరు రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు మూవీ డైరెక్టర్ వంశీకృష్ణ. భారీ అంచనాల మధ్య మాస్ మహారాజ్ తో తీసినా టైగర్ నాగేశ్వరరావు చిత్రం డిజాస్టర్ గా మిగలడంతో అతనికి ఊహించిన రేంజ్ గుర్తింపు దక్కలేదు.

రవితేజ తో టైగర్ నాగేశ్వరరావు సినిమా చేయడానికి ముందు వంశీకృష్ణ మంచు లక్ష్మి, అడవి శేష్ కాంబోలో వచ్చిన దొంగాట చిత్రానికి దర్శకత్వం వహించారు. కానీ ఆ చిత్రం కూడా ఊహించిన గుర్తింపుని అందివ్వలేకపోయింది. ఇక ఆ విషయం పక్కన పెడితే ఈరోజు వంశీకృష్ణ వైవాహిక బంధం లో అడుగు పెట్టారు. ఈ బుధవారం ఉదయం ఆయన వివాహం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మధ్య జరిగింది.

ఈ వివాహ వేడుకలకు హాజరైన నిర్మాత అభిషేక్ అగర్వాల్ నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చిన్నప్పుడు కమల్ హాసన్ నటించిన నాయక్ చిత్రాన్ని చూసి ఇన్స్పైర్ అయిన వంశీకృష్ణ తాను కూడా ఒక బయోపిక్ ని తీయాలి అని భావించారట.

అందుకే 1970 సమయంలో స్టువర్టుపురంలో పేరు మోసినా గజదొంగ అయినా టైగర్ నాగేశ్వరరావు జీవితాన్ని బయోపిక్ గా తీయడానికి నిర్ణయించుకున్నారు. అలా తెరకెక్కిన చిత్రమే టైగల్ నాగేశ్వరరావు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించిన ఈ చిత్రం ఊహించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక వంశీకృష్ణ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై వర్క్ చేస్తున్నారు. ఈసారైనా అతను తీసే సినిమా మంచి సక్సెస్ సాధిస్తుందని అందరూ భావిస్తున్నారు.

Tags:    

Similar News