ఈ కాంబో సెట్ అయ్యుంటే బాక్సాఫీస్ షేక్ అయ్యేది..!

క్రియేటివ్ డైరెక్టర్ అన్న దానికి పర్ఫెక్ట్ డెఫినిషన్ అనేలా ఒకప్పుడు తన సినిమాలతో ప్రేక్షకులను రంజింప చేసిన డైరెక్టర్ కృష్ణ వంశీ

Update: 2024-08-12 17:30 GMT

క్రియేటివ్ డైరెక్టర్ అన్న దానికి పర్ఫెక్ట్ డెఫినిషన్ అనేలా ఒకప్పుడు తన సినిమాలతో ప్రేక్షకులను రంజింప చేసిన డైరెక్టర్ కృష్ణ వంశీ. ఆయన సినిమా వస్తుంది అంటే చాలు కచ్చితంగా మ్యాటర్ ఉంటందని అనుకునే వారు. ఒకరిద్దరు స్టార్స్ తప్ప కృష్ణ వంశీ తీసిన సినిమాలతో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న వారు ఉన్నారు. మహేష్ తో మురారి, ప్రభాస్ తో చక్రం, ఎన్టీఆర్ తో రాఖీ సినిమాలు చేసిన కృష్ణ వంశీ రవితేజతో తీసిన ఖడ్గం సినిమా ఎప్పటికీ స్పెషల్ సినిమాగా నిలుస్తుంది. కృష్ణ వంశీ నుంచి సినిమా వస్తుంది అంటే ఆసక్తిగా ఎదురుచూసే ప్రేక్షకులను ఆయన ఏర్పాటు చేసుకున్నారు.

ఐతే కృష్ణవంశీ పవర్ స్టార్ పవన్ కళ్యణ్ తో సినిమా చేయాలని అనుకున్నారట. అంతేకాదు ఆ కాంబో సినిమాకు చర్చలు కూడా జరిగాయట. కానీ ఎందుకో అది ముందుకు కదల్లేదు. ఈ విషయాన్ని కూడా డైరెక్టర్ కృష్ణ వంశీ సోషల్ మీడియా చిట్ చాట్ లో ఒక అభిమానితో పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేసి ఉంటే అది పెద్ద బ్లాస్ట్ అయ్యేది. నా దురదృష్టమని అన్నారు కృష్ణ వంశీ.

కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన మురారి సినిమా ఈ నెల 9న సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే రోజు రీ రిలీజైంది. అదేదో కొత్త సినిమా రిలీజ్ అన్న రేంజ్ లో ఏ ఏరియాకు ఆ ఏరియా సూపర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా తెలిసిందే. ఐతే ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా రెండేళ్ల తర్వాత గౌతంతో మురారి సీక్వెల్ చేసేయండని ఓ నెటిజెన్ కృష్ణ వంశీని అడిగితే. అది మన చేతుల్లో లేదు. మహేష్, నమ్రత, గౌతం లు అది డిసైడ్ చేయాలని అన్నారు కృష్ణ వంశీ.

మురారి రీ రిలీజ్ ఏమో కానీ మళ్లీ కృష్ణ వంశీ సినిమాల గురించి.. ఆయన క్రియేటివిటీ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఇప్పటి యూత్ కి ఆయన డైరెక్షన్ టాలెంట్ తెలియకపోవచ్చు కానీ ఆయన తీసిన సింధూరం, సముద్రం, గులాబి, అంతపురం ఈ సినిమాలు ఇప్పుడు రిలీజ్ చేసినా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంటాయని చెప్పొచ్చు. ఐతే రీసెంట్ గా కృష్ణ వంశీ నుంచి రంగమార్తాండ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.

Tags:    

Similar News