ఉరుమెళ్లి మంగ‌లం మీద ప‌డ‌టం అంటే ఇదేనేమో!

అలియాభ‌ట్ న‌టించిన `జిగ్రా` ప్లాప్ అవ్వ‌డం వివాదాస్ప‌దంగా మారిన సంగ‌తి తెలిసిందే.

Update: 2024-10-17 10:02 GMT

అలియాభ‌ట్ న‌టించిన `జిగ్రా` ప్లాప్ అవ్వ‌డం వివాదాస్ప‌దంగా మారిన సంగ‌తి తెలిసిందే. త‌ప్పుడు క‌లెక్ష‌న్లు..ఫేక్ బుకింగ్ లు చూపించి బాలీవుడ్ ప‌రువు తీస్తున్నార‌ని న‌టి , ద‌ర్శ‌క‌, నిర్మాత దివ్యా ఖోస్లా సంచ‌ల‌న విమ‌ర్శ‌లు చేసిం ది. దీంతో బ‌డా ద‌ర్శ‌క‌, నిర్మాత క‌ర‌ణ్ జోహార్ రంగంలోకి దిగి మూర్ఖుల‌కు ఇచ్చే సమాధానం మౌన‌మే అంటూ కౌంట‌ర్ ఇచ్చాడు. జిగ్రా నిర్మాత‌లు ఇవ్వాల్సిన కౌంట‌ర్ క‌ర‌ణ్ రూపంలో ఆమెకి ఎదురైంది.

ప్ర‌తిగా దివ్య ఊరుకోలేదు. త‌న‌పైనే ఇలాంటి వివ‌క్ష చూపిస్తుంటే కొత్త‌గా వ‌చ్చే అమ్మాయిల ప‌రిస్థితి ఏంట‌ని అందుకుంది. ఇప్పుడీ ఈ వ్య‌వ‌హార‌మంతా ఉరుమెళ్లి మంగ‌ళం మీద ప‌డిన‌ట్లు అలియాభ‌ట్ భ‌ర్త ర‌ణ‌బీర్ క‌పూర్- నిర్మాత భూషణ్ కుమార్ పై ప‌డుతుంది. ఎందుకంటే `జిగ్రా`లో న‌టించింది ర‌ణ‌బీర్ భార్య అలియాభ‌ట్ కాగా, భూష‌ణ్ కుమార్ దివ్యా ఖోస్లా భ‌ర్త కాబ‌ట్టి! వీళ్ల కాంబినేష‌న్ లో గ‌తంలో తెర‌కెక్కిన `యానిమల్` సంచ‌ల‌నం విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడీ సినిమాకి సీక్వెల్ గా `యానిమ‌ల్ పార్క్` కూడా ప్ర‌క‌టించారు.

దివ్యా ఖోస్లో చేసిన వ్యాఖ్య‌లు యానిమల్ టీమ్ లోనూ వివాదాస్ప‌దంగా మారుతున్నాయి. అలియాభ‌ట్ మెయిన్ లీడ్ పోషించిన జిగ్రా ప్లాప్ విష‌యంలో ఆమె స్పందించ‌క‌పోయినా? ఇలా మ‌రో న‌టి త‌ను న‌టించిన సినిమాపై విమ‌ర్శ‌లు చేయ‌డం ఎంతైనా జీర్ణించుకోలేనిదే. ఒకే ప‌రిశ్ర‌మ‌లో ఉన్న వాళ్లు వీరంతా. తేల్లారితే ఎదుర‌ప‌డే వారు. అలాగని దివ్యా ఖోస్లా వ్యాఖ్య‌లు కొట్టి పారేయాల్సిన ప‌నిలేదు. ఆమె స‌త్యం వైపు మాట్లాడింది.

నిజానికి ఆ సినిమా ప్లాప్ అని అందరికీ తెలిసిందే. కానీ క‌ర‌ణ్ జోహార్ మాత్రం ఇండ‌స్ట్రీ మీద ప్రేమ‌తో ప‌రువు పోకూడ‌ద‌ని స్పందించారు. అలాగ‌ని వాస్తవాన్ని దాచి పెట్ట‌డం స‌బ‌బు కాద‌న్న‌ది గుర్తించాలి. మొత్తంగా ఈ వివాదం `యానిమ‌ల్ పార్క్` పై పడ‌కుండా ఉంటే చాలు అని ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగ మ‌న‌సులో అనుకుంటున్నాడేమో.

Tags:    

Similar News