అర్థ‌రాత్రి విడాకుల మెసేజ్.. కుంగిపోయాన‌న్న‌ జెనీలియా

అయితే ఒక అర్థ‌రాత్రి రితేష్ పెట్టిన ఓ మెసేజ్ కి కంగారు ప‌డ్డాన‌ని, చాలా కుంగిపోయాన‌ని జెనీలియా వ్యాఖ్యానించ‌డం హాట్ టాపిక్ అయింది.

Update: 2024-10-03 19:30 GMT

హిందీ చిత్ర పరిశ్రమలోని ఆద‌ర్శ‌ జంటలలో రితీష్ దేశ్‌ముఖ్ - జెనీలియా డిసౌజా ఒకరు. ఈ జంట మొదట 2002లో కలుసుకున్నారు. చాలా కాలం పాటు ప్రేమ‌లో ఉన్నారు. 2012లో వివాహం చేసుకున్నారు. రితీష్ -జెనీలియా తరచుగా అభిమానుల‌కు ప్రధాన జంట లక్ష్యాలను నిర్దేశిస్తారు. పదే పదే రితీష్ - జెనీలియా తమ ఫ్యామిలీ లైఫ్‌లోని స‌రిగ‌మ‌ల‌ను బ‌హిరంగంగా అభిమానుల కోసం షేర్ చేస్తుంటారు.

అయితే ఒక అర్థ‌రాత్రి రితేష్ పెట్టిన ఓ మెసేజ్ కి కంగారు ప‌డ్డాన‌ని, చాలా కుంగిపోయాన‌ని జెనీలియా వ్యాఖ్యానించ‌డం హాట్ టాపిక్ అయింది. అర్థ‌రాత్రి దాటాక తెల‌తెల్ల‌వారుతుండ‌గా 2.30 గం.ల‌కు ఆ టెక్ట్స్ మెసేజ్ చ‌దివి ఏం జ‌రిగిందో అర్థంగాక చాలా ఆవేద‌న చెందాన‌ని జెనీలియా తెలిపింది.

శ్రేయా గోధావత్ యూట్యూబ్ ఛానెల్‌లో ఒక ఇంటర్వ్యూలో జెనీలియా డిసౌజా త‌మ డేటింగ్ గురించి మాట్లాడింది. డేటింగ్ స‌మ‌యంలోనే రితీష్ లోని చిలిపిత‌నం గురించి గుర్తు చేసుకుంది. తన బాయ్‌ఫ్రెండ్ ఆలస్యంగా నిద్రపోయేవాడని ఆ స‌మ‌యంలో అత‌డి సరసన ఉండేదానిని అని వెల్లడించింది. అయితే ఒక‌రోజు రాత్రి విడిపోదాం! అంటూ రితీష్ తనకు మెసేజ్ పంపాడని జెనీలియా తెలిపింది. తాను తెల్లవారుజామున 2:30 గంటలకు టెక్స్ట్ మెసేజ్ చదివానని, ఏం జరిగిందనే దానిపై పూర్తిగా అవగాహన లేదని జెనీలియా వెల్లడించింది.

మేము ఒకరితో ఒకరు డేటింగ్ చేస్తున్నప్పుడు అది ఏప్రిల్ ఫూల్స్ డే (ఏప్రిల్ 1).. ఇక బ్రేక‌ప్! అని మెసేజ్ పంపాడు. త‌ర్వాత అత‌డు నిద్రపోయాడు. అతను చాలా ఆలస్యంగా నిద్రపోయేవాడు.. నేను త్వరగా నిద్రపోయేదానిని. అతడు ఈ మెసేజ్‌ని రాత్రి 1 గంటకు పంపాడు. నేను దానిని ఉదయం 2:30 కి చదివాను. అది చ‌ద‌వ‌గానే నేను నిరాశకు గురయ్యాను. ఉదయం 9 గంటల వరకు.. రితీష్ మేల్కొనే వరకు తాను చాలా బాధప‌డ్డానని జెనీలియా డిసౌజా వెల్లడించింది. మరుసటి రోజు ఉదయం రితీష్ తనకు ఫోన్ చేసిన విషయాన్ని జెనీలియా గుర్తు చేసుకుంది.

తాను అత‌డితో మాట్లాడన‌ని జెనీలియా చెప్పింది. మునుపటి రాత్రి తనకు పంపిన టెక్స్ట్ మెసేజ్ గురించి అతనికి గుర్తు చేసింది. సరే.. ఏప్రిల్ ఫూల్స్ డే కావడంతో అలా చేశానని రితీష్ వివరించాడు. ఆ త‌ర్వాత అంతా స‌ర్ధుకుంది.

కానీ ఉదయం 9 గంటల వరకు నేను కుంగిపోయాను. అతడు తాను చేసిన‌ది గుర్తు లేకుండా నిద్ర‌ లేచాడు. నిద్రలేచి, `హాయ్, ఏమైంది?` అని ఫోన్ చేసాడు. నేను నీతో మాట్లాడకూడదనుకుంటున్నాను అని చెప్పాను. ఏం తప్పు జరిగింది? అని అడిగాడు.. అంటూ నాటి ఘ‌ట‌నను జెనీలియా గుర్తు చేసుకుంది.

జెనీలియా డిసౌజా ఒకసారి తమ పెళ్లి అయిన ఒక నెల తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నట్లు వెల్లడించింది. లేడీస్ వర్సెస్ జెంటిల్‌మన్ సీజన్ 2 షోలో మాట్లాడుతున్నప్పుడు ఈ విష‌యాన్ని జెనీలియా తెలిపింది. తన భర్తకు చెందిన సాంప్రదాయక మరాఠీ కుటుంబానికి సంబంధించిన నిబంధనల ప్రకారం ప్రతిరోజూ సంప్రదాయ దుస్తులు .. భారీ ఆభరణాలతో అలంకరించుకోవాలని తాను భావించినట్లు జెనీలియా వెల్లడించింది. జెనీలియా తన భర్తను అయోమయానికి గురి చేస్తూ ప్రతి ఉదయం అలంకరించుకునేద‌ట‌. తరువాత `నేను ఇకపై ఇదంతా చేయలేను` అని కన్నీళ్లతో విరుచుకుపడింది. ఆపై రితీష్ జెన్నీని ఓదార్చాడు. ప్రతిరోజూ ఉదయం ఆమె ఎందుకు అలంకరించుకుందో అర్థంగాక అత‌డు కూడా గందరగోళానికి గురయ్యాడట‌.

జెనీలియా తెలుగు వారికి బొమ్మ‌రిల్లు హాసినిగా సుప‌రిచితం. రితేష్ దేశ్ ముఖ్ తో క‌లిసి ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌లో న‌టించింది. అదే క్ర‌మంలో ఆ ఇద్ద‌రూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్ర‌స్తుతం హిందీ, మ‌రాఠా చిత్ర రంగాల‌లో ఈ జంట సినిమాల‌ను నిర్మిస్తున్నారు.. న‌టిస్తున్నారు.

Tags:    

Similar News