స్టార్ హీరోయిన్ భ‌ర్త‌పై ఆరోప‌ణ‌లు!

మేమంతా చాలా కాలంగా సహిస్తున్న అనైతికత‌.. విలువ‌ల్లేని ప్రవర్తనను స‌హించ‌లేకున్నాం'' అని రాసింది.

Update: 2024-06-23 03:53 GMT

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇటీవ‌ల బాలీవుడ్ న‌టుడు కం నిర్మాత జాకీ భ‌గ్నానీని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. ఈ జంట అన్యోన్య‌త అభిమానుల్లో జంట గోల్స్ ని ఫిక్స్ చేస్తోంది. అయితే జాకీ భ‌గ్నానీ ఊహించ‌ని రీతిలో ఇప్పుడు నిందారోప‌ణ‌లు ఎదుర్కొంటున్నాడు. అత‌డు త‌మ‌కు చెల్లించాల్సిన భ‌త్యాల‌ను చెల్లించ‌లేద‌ని రెండేళ్లుగా వేచి చూస్తూనే ఉన్నామ‌ని అత‌డికి చెందిన పూజా ఎంట‌ర్ టైన్ మెంట్ బ్యాన‌ర్ పై దాదాపు 100 మంది ఆరోపించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

జాకీ భగ్నాని ప్రొడక్షన్ హౌస్ పూజా ఎంటర్‌టైన్‌మెంట్ సిబ్బంది జీతాలు చెల్లించలేదని ఆరోపిస్తూ..రుచితా కాంబ్లే అనే అమ్మాయి తన ఇన్‌స్టాగ్రామ్ లో ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఇది స‌రికాద‌ని అంది. ఇలాంటి పోస్ట్‌లు చేసే వ్యక్తిని కాదు.. కొన్నిసార్లు త‌ప్ప‌దు! కష్టపడి సంపాదించిన డబ్బును పొందడం కోసం నా బృందం నేను ప‌డిన క‌ష్టం ఈ ప‌ని చేసేందుకు కార‌ణ‌మైంది. మేమంతా చాలా కాలంగా సహిస్తున్న అనైతికత‌.. విలువ‌ల్లేని ప్రవర్తనను స‌హించ‌లేకున్నాం'' అని రాసింది.

సెట్లో పూర్తి అయిన తర్వాత 45-60 పని దినాలలో క్లియర్ చేస్తామ‌ని వాగ్దానం చేసారు. కానీ ఒక‌రిపై నెపం వేసి ఒక‌రు త‌ప్పించుకుంటున్నారు. మేం ఇలా చేయ‌డం వ‌ల్ల మాకు భ‌త్యం వ‌స్తుంద‌నే ఆశ‌లేదు. కానీ ఇత‌రులు ఇలా మోస‌పోకూడ‌ద‌నే ఇలా చేస్తున్నాం. జాకీ భ‌గ్నానీ, వాసు భ‌గ్నానీ మోస‌పూరిత ప‌ద్ధ‌తుల గురించి తెలియ‌జేయ‌డానికే ఇలా చేశాం. వారితో పని చేయకూడదని హామీ ఇవ్వడానికి ఈ పోస్ట్. దయచేసి ఈ పోస్ట్‌ను మళ్లీ షేర్ చేయమని స్నేహితులను కోరండి . ఇతర చిత్రనిర్మాతలను కూడా అలా చేయవ‌ద్ద‌ని కోరండి. మీడియా సంస్థలతో అనుబంధం కలిగి ఉంటే ఈ వార్త‌ను క‌వ‌ర్ చేయ‌మ‌ని చెప్పండి`` అని రాసారు.

రెండేళ్ల క్రితం ఈ ప్రొడ‌క్ష‌న్ తో ప‌ని చేసాను. నేను కనీసం 100 మంది సిబ్బందితో పాటు మా చెల్లింపుల కోసం (2 నెలల జీతాలు) 2 సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్నాము. నేను కష్టపడి సంపాదించిన డబ్బు ఎక్కడ ఉంది? మాకు చెల్లించాలి.. అని మ‌రొక‌రు రాసారు. ఒక‌రిని చూసి ఒక‌రుగా ఇలా సోష‌ల్ మీడియాల్లో జాకీ భ‌గ్నానీ సంస్థ‌పై ఆరోపించ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. భ‌గ్నానీల‌కు చెందిన పూజా ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ లో బ‌డే మియాన్ చోటే మియాన్ లాంటి భారీ చిత్రం తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. అక్ష‌య్, టైగ‌ర్ లాంటి యాక్ష‌న్ హీరోలు న‌టించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ అవ్వ‌డంతో దాదాపు 200 కోట్లు న‌ష్టం వాటిల్లింద‌ని హిందీ మీడియాలో క‌థ‌నాలొచ్చాయి.

Tags:    

Similar News