జాక్వలైన్.. టాలీవుడ్ లో క్రేజీ ప్లాన్!

మోడలింగ్ నుంచి సినీ నటిగా మారిన ఈ బ్యూటీకి వరుసగా అవకాశాలు వచ్చాయి.

Update: 2024-05-11 14:30 GMT

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న అందాల భామ జాక్వలైన్ ఫెర్నాండేజ్. ఈ శ్రీలంక బ్యూటీ 2009లో అల్లాదీన్ మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది. మోడలింగ్ నుంచి సినీ నటిగా మారిన ఈ బ్యూటీకి వరుసగా అవకాశాలు వచ్చాయి. దీంతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

సల్మాన్ ఖాన్ అండదండలు కూడా జాక్వలైన్ కి దొరకడంతో దర్శక, నిర్మాతలు కూడా ఈ బ్యూటీకి ఎక్కువ ఛాన్స్ లు ఇచ్చారు. ఈ అమ్మడు ప్రభాస్ సాహో సినిమాలో ఐటెం సాంగ్ లో చేసింది. ఆ సాంగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సుదీప్ విక్రాంత్ రోనాలో జాక్వలైన్ ఫెర్నాండేజ్ చేసిన ఐటెం సాంగ్ బాగా పాపులర్ అయ్యింది. స్పెషల్ సాంగ్స్ కోసం అప్పట్లో ఈ బ్యూటీ రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ అందుకున్నట్లు టాక్స్ కూడా వచ్చాయి.

అయితే సౌత్ ఇండియాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని జాక్వలైన్ చాలా కాలంగా ప్రయత్నం చేస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో జాక్వలైన్ ఫెర్నాండేజ్ ఒక హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది క్లారిటీ లేదు. ఇంతలో టాలీవుడ్ లో ఓ ఫీమేల్ సెంట్రిక్ మూవీలో ఆ శ్రీలంక బ్యూటీ అవకాశం అందుకున్నట్లు తెలుస్తోంది.

పేపర్ బాయ్ సినిమాతో దర్శకుడిగా సక్సెస్ కొట్టిన యంగ్ డైరెక్టర్ జయ శంకర్. ఈ దర్శకుడు రెండో సినిమాగా ఆరి అనే చిత్రాన్ని తెరకెక్కించారు. హరిషడ్వార్గాలు కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని జయశంకర్ తెరకెక్కించారు. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది. మూడో సినిమా కోసం ఇంటరెస్టింగ్ ఫీమేల్ సెంట్రిక్ స్టోరీని సిద్ధం చేసుకున్నాడంట.

ఈ మూవీలో లీడ్ రోల్ కోసం జయశంకర్ జాక్వలైన్ ఫెర్నాండేజ్ ని సంప్రదించి కథ చెప్పాడంట. ఆమెకి కథ బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలో ఈ సినిమాకి సంబందించిన అఫీషియల్ ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ తెలుగు, హిందీ భాషలలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంట. ఎలాగైనా ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకొని అమ్మడు సౌత్ లో కూడా మరింత క్రేజ్ అందుకోవాలి అనుకుంటోంది. ఇప్పటివరకు ఆమె సౌత్ లో చేసిన ప్రయత్నాలు పెద్దగా వర్కౌట్ కాలేదు. మరి ఈసారి ఎలాంటి క్రేజ్ అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News