పుష్కర కాలం తర్వాత ఆ సినిమా గురించి హీరో..!

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను బయట పెట్టారు జీవా.

Update: 2024-10-09 11:30 GMT

కోలీవుడ్ హీరో జీవా సౌత్ సినీ ప్రియులకు సుపరిచుతుడే. ఆయన చేసిన రంగం సినిమా తెలుగులో సూపర్ హిట్ గా నిలిచింది. ఐతే ఆ తర్వాత మాత్రం జీవా ఆ రేంజ్ హిట్ అందుకోలేదు. అటు తమిళ్ లో కూడా కెరీర్ పరంగా జీవా అనుకున్న రేంజ్ లో సక్సెస్ లు అందుకోలేదు. ఐతే లేటేస్ట్ గా బ్లాక్ తో తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్నాడు జీవా. కె.జి. బాలసుబ్రమణి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. దసరా కానుకగా అక్టోబర్ 11న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను బయట పెట్టారు జీవా.


ముఖ్యంగా 12 ఏళ్ల క్రితం వచ్చిన మూగమూడి అదే సినిమా తెలుగులో మాస్క్ గా రిలీజైంది. ఆ సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడారు జీవా. మిస్కిన్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూగమూడి సినిమా ఫైనల్ కాపీ చూశాక సెకండ్ హాఫ్ లాగ్ అయిందని డైరెక్టర్ తో చెప్పాడట జీవా. కానీ డైరెక్టర్ మిస్కిన్ తన మాట పట్టించుకోలేదని అన్నారు. దాని వల్ల సినిమా ఫలితం ఎలా వచ్చిందో తెలిసిందే.

అదే కాదు తను నటించిన నీదానే ఎన్ పొన్వసంతం సినిమా కూడా లెంగ్త్ విషయంలో ఇష్యూ ఉందని అన్నారు. గౌతం వాసుదేవ మీనన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదని గుర్తు చేశారు. ఐతే ఈ సినిమానే తెలుగులో ఎటో వెళ్లిపోయింది మనసు అని రీమేక్ చేశారు. మూగమూడి సినిమా తెలుగులో మాస్క్ గా రిలీజై యావరేజ్ గా నిలిచింది.

మూగముడి సినిమాతోనే పూజా హెగ్దే మొదట సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఇక రీసెంట్ గా తనకు జరిగిన కారు ప్రమాదం గురించి కూడా చెప్పారు జీవా. ఆ ప్రమాదం జరిగినప్పుడు ఒక పర్సన్ వీడియో తీసి వైరల్ చేశారని అన్నారు. అతని వల్లే ఆ ప్రమాదం గురించి అందరికీ తెలిసిందని చెప్పారు. జీవా బ్లాక్ సినిమా సైన్స్ ఫిక్షన్ హారర్ మూవీగా వస్తుంది. ఈ సినిమాలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను హాలీవుడ్ సినిమా కొహెరెన్స్ రిఫరెన్స్ తో తెరకెక్కించారని కోలీవుడ్ టాక్.

Tags:    

Similar News