100 కోట్లు అడిగే స్టార్లు నిజం ఏంటో చూడాలి: జాన్ అబ్రహాం!
100 కోట్లు అంతకుమించి పారితోషికం అందుకుంటున్న హీరోలు అంతకంతకు పెరుగుతున్నారు.
100 కోట్లు అంతకుమించి పారితోషికం అందుకుంటున్న హీరోలు అంతకంతకు పెరుగుతున్నారు. ఒకే ఒక్క పాన్ ఇండియా హిట్ దక్కితే చాలు.. హీరోల పారితోషికాలు చుక్కల్ని తాకుతున్నాయి. పెరిగిన వసూళ్లకు తగ్గట్టే భారీ పారితోషికం అదనంగా లాభాల్లో వాటాలను ఆశిస్తున్నారు.
అదే సమయంలో ఇండస్ట్రీలో నిర్మాతపై భారం పెంచుతున్న అంశాల ప్రస్థావన వస్తోంది. ఒక్క హీరోకి 100 కోట్లు ముట్టజెప్పడం అంటే అది ఆషామాషీనా? ఇలాంటి విషయాలపై పబ్లిక్ లో ఓపెన్ గానే వాపోతున్నారు నిర్మాతలు. కరణ్ జోహార్, ఫరా ఖాన్, కబీర్ బేడి ఇప్పటికే హీరోల డిమాండ్లపై తమ అసంతృప్తిని వ్యక్తం చేసారు. స్టార్ హీరో కం నిర్మాత జాన్ అబ్రహం కూడా ఇప్పుడు పారితోషికంపై తన వైఖరిని షేర్ చేసారు.
``హీరోలు రూ.100 కోట్లు అడుగుతున్నారు..వారి స్టైలిస్టులు రోజుకు రూ.2 లక్షలు డిమాండ్ చేస్తున్నారు`` ఇది సరైనదేనా? అని ప్రశ్నించగా..జాన్ అబ్రహం వెంటనే స్పందించారు. ``ఈ పరిస్థితి ఇప్పటికే హిందీ సినిమాను దెబ్బతీస్తోంది. ఈ రోజుల్లో మనం సినిమాల్లో నటించడానికి స్టార్లకు డబ్బులు చెల్లించకూడదు. ఎందుకంటే మనం భారీ బడ్జెట్లు.. భారీ పారితోషికాలను సమర్థించము. నటులే ఈ విధంగా ఆలోచిస్తున్నారా లేదా ఏజెంట్ లు ఇవన్నీ పుట్టిస్తున్నారా? అన్నది నాకు తెలియదు. ఎలా పట్టుకోవాలో అర్థం కావడం లేదు`` అని అన్నారు. ఎవరైనా ఒక బుడగలో చిక్కుకుని తెలివితక్కువవాళ్లు కాకూడదు. నువ్వు బయటకు వచ్చి వాస్తవ ప్రపంచాన్ని చూడాలి. ఒక పరిశ్రమగా మనం నిజంగా బాధపడుతున్నాం`` అని జాన్ అబ్రహం అన్నాడు.
మనం లోతైన బ్లాక్ హోల్లో ఉన్నామని కూడా నటులు అంగీకరించాలి. నటులు వెనకటి రోజులకు వెళ్లి సినిమాపై పని చేయాలి. సినిమాలు లాభాలు ఆర్జిస్తే, మనం లాభాలు ఆర్జిస్తాం. వ్యవస్థను ఎండగడితే (డబ్బు లేకుండా) మళ్ళీ ఒక చేత్తో చప్పట్లు కొట్టలేరు. ఆ అసభ్యకరమైన మొత్తాలను చెల్లించడానికి సిద్ధంగా ఉన్న నిర్మాతలు కూడా ఉన్నారు... అని తెలిపారు.
జాన్ అబ్రహం ఇంతకుముందు పఠాన్ చిత్రంలో విలన్ గా నటించాడు. తదుపరి స్పై థ్రిల్లర్ ది డిప్లొమాట్లో కనిపిస్తారు. ఈ చిత్రం మార్చి 15న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి శివం నాయర్ దర్శకత్వం వహించారు.