ఇక్కడ బాల‌య్య‌...అక్క‌డ క‌రీనా?

చిరంజీవి...నాగార్జున‌, వెంక‌టేష్ లాంటి బాల‌య్య త‌రం హీరోలున్నా? వాళ్లెవ్వ‌రూ బాల న‌టులు కాక‌పోవ‌డంతో బాల‌య్యకే అది సాధ్య‌మైంది.

Update: 2024-09-15 15:30 GMT

నట‌సింహ బాల‌కృష్ణ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 50 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌ల‌కు తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ ఘ‌నంగా నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఇంత‌వ‌ర‌కూ ఏ న‌టుడ‌కి ఇలాంటి గౌర‌వం ద‌క్క‌లేదు. ఆ ర‌కంగా బాల‌య్య ఓ రికార్డు న‌మోదు చేసారు. బాల న‌టుడిగానే బాల‌య్య ప్ర‌యాణం మొద‌లు పెట్ట‌డంతో ఇది సాధ్య‌మైంది. చిరంజీవి...నాగార్జున‌, వెంక‌టేష్ లాంటి బాల‌య్య త‌రం హీరోలున్నా? వాళ్లెవ్వ‌రూ బాల న‌టులు కాక‌పోవ‌డంతో బాల‌య్యకే అది సాధ్య‌మైంది.

తాజాగా బాలీవుడ్ న‌టి క‌రీనా క‌పూర్ కూడా ఇలాంటి అరుదైన గౌర‌వం బాలీవుడ్ ప‌రిశ్రమ నుంచి అందుకుంది. ఆమె ఇండ‌స్ట్రీ వ‌చ్చి 25 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా ఆమె పేరిట ప‌రిశ్ర‌మ చిత్సోత్స‌వాన్ని నిర్వ‌హిస్తుంది. గ‌తంలో ఈ ఘ‌న‌త దిలీప్ కుమార్, అమితాబ‌చ్చ‌న్ ల‌కు మాత్రమే ద‌క్కింది. వాళ్లిద్ద‌రు ఎంతో సీనియ‌ర్లు కావ‌డంతో అప్ప‌ట్లో ప‌రిశ్ర‌మ త‌రుపున నిర్వ‌హించారు. మ‌ళ్లీ ఇప్పుడు ఓ న‌టిగా క‌రీనా ఆగౌర‌వం అందుకుంటుంది.

ఈ చిత్రోత్స‌వంలో భాగంగా ప‌లు ప్రాంతాల్లో ఆమె న‌టించిన సినిమాల్ని ప్ర‌ద‌ర్శిస్తారు. `రిప్యూజ్`, `క‌భీ ఖుషీ కభీ ఘ‌మ్`, `3 ఇడియ‌ట్స్`, చ‌మేలి, లాంటి త‌దిర‌త చిత్రాల్ని ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. ఇంకా ఆమె జీవితంలో గొప్ప‌గా మిగిలి పోయిన మ‌రిన్ని చిత్రాల్ని స్పెష‌ల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. ఆర‌కంగా క‌రీనా క‌పూర్ పేరిట ఇది రికార్డు అని చెప్పాలి. క‌రీనా జ‌న‌రేష‌న్ హీరోయిన్లు చాలా మంది ఉన్నారు.

కానీ వాళ్లెవ్వ‌రికీ ద‌క్క‌ని అరుదైన ఘ‌త‌న బెబో సొంతం చేసుకుంటుంది. ఇటీవ‌లే క‌రీనా నిర్మాత‌గా కూడా ప్ర‌యాణం మొద‌లు పెట్టింది. `ది బ‌కింగ్ హామ్ మ‌ర్డ‌ర్స్` చిత్రాన్ని నిర్మాత ఏక్తా క‌పూర్ తో క‌లిసి నిర్మిస్తుంది. ఇక‌పై క‌రీనా ఇత‌ర భాగ‌స్వాముల‌తో క‌లిసి మ‌రిన్ని సినిమాలు నిర్మించే దిశ‌గా అడుగులు వేస్తోంది.

Tags:    

Similar News