వావ్ కార్తీ.. నీ టాలెంట్ సూపర్బ్

హీరో కార్తీలో యాక్టింగ్ టాలెంట్ తో పాటు మంచి గాయకుడు కూడా ఉన్నాడు.

Update: 2024-09-24 09:31 GMT

హీరో కార్తీలో యాక్టింగ్ టాలెంట్ తో పాటు మంచి గాయకుడు కూడా ఉన్నాడు. చాలా సినిమాలలో కార్తీ సాంగ్స్ పాడాడు. ఎక్కువగా అతను హీరోగా చేసిన మూవీస్ లలో కార్తీ పాడిన సాంగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ సినిమాలో కూడా కార్తీ ఒక పాట పాడాడు. అప్పుడప్పుడు సినిమా ప్రమోషన్స్ ఈవెంట్స్ లో కూడా కార్తీ తన సింగింగ్ టాలెంట్ చూపిస్తూ ఉంటాడు. అతని వాయిస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.

ఇదిలా ఉంటే ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో కార్తీ హీరోగా తెరకెక్కిన ‘సత్యం సుందరం’ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. సెప్టెంబర్ 27న ఈ సినిమా థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో తాజాగా జరిగింది. ఈ ఈవెంట్ లో కార్తీ స్టేజ్ పైన సాంగ్ పాడాడు. ‘అభినందన’ సినిమాలోనే 'అదే నీవు అదే నేను' సాంగ్ ని పాడి అలరించారు. ఈ సాంగ్ కి కార్తీ అద్భుతంగా పాడాడనే మాట వినిపిస్తోంది.

ప్రమోషన్ ఈవెంట్ లో కార్తీ సినిమా గురించి ఇంటరెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషనల్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కింది. మూవీలో యాక్షన్ సీన్స్ లాంటివి ఎక్స్ పెక్ట్ చేయొద్దని తన అభిమానులకి సూచించాడు. మంచి ఎమోషనల్ డ్రామా ఉంటుందని అన్నాడు. 2D ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘96’ సినిమాతో విజయ్ సేతుపతికి ప్రేమ్ కుమార్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు.

ఈ చిత్రాన్ని తెలుగులో శర్వానంద్, సమంత జోడీగా జాను టైటిల్ తో రీమేక్ చేశారు. అయితే ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. ప్రేమ్ కుమార్ మూడో చిత్రంగా సత్యంసుందరం తెరకెక్కింది. మొదటి చిత్రం తరహాలోనే ఎమోషనల్ జర్నీగా ఈ కథని కూడా చెప్పాడు. కార్తీ కూడా ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నారు. తెలుగు ప్రేక్షకులు కూడా కార్తీ నుంచి అతని స్టైల్ ఎంటర్టైన్మెంట్ ని కోరుకుంటున్నారు.

చివరిగా జపాన్ అనే సినిమాతో కార్తీ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ‘సత్యంసుందరం’ మూవీతో సక్సెస్ అందుకుంటాననే కాన్ఫిడెన్స్ తో కార్తీ ఉన్నాడు. మూవీలో అరవింద్ స్వామి కీలక పాత్రలో నటించాడు. బావబామ్మర్ధి మధ్యలో నడిచే కథాంశంగా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది.

Tags:    

Similar News