38 ఏళ్ల క్రితం జ్ఞాపకాల్లోకి..!

వెంకటేష్ హీరోగా మొదటి సినిమా 'కలియుగ పాండవులు' వచ్చి 38 ఏళ్లు పూర్తి అయ్యింది. 1986 ఆగస్టు 14న ఆ సినిమా విడుదల అయ్యింది

Update: 2024-08-14 14:48 GMT

వెంకటేష్ హీరోగా మొదటి సినిమా 'కలియుగ పాండవులు' వచ్చి 38 ఏళ్లు పూర్తి అయ్యింది. 1986 ఆగస్టు 14న ఆ సినిమా విడుదల అయ్యింది. వెంకటేష్ తో పాటు ఆ సినిమాతో ఖుష్బూ హీరోయిన్ గా పరిచయం అయ్యింది. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో రూపొందిన కలియుగ పాండవులు సినిమాను రామానాయుడు నిర్మించాడు. ఆ సినిమా తో వెంకటేష్ సెన్షేషనల్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఖుష్బూ ఆ సినిమా తర్వాత స్టార్‌ హీరోయిన్‌ గా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తెలుగు మరియు తమిళంలో ఖుష్బూ వరుసగా సినిమాలు చేసి మెప్పించింది.

1990 ల్లో స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ గా నిలిచిన ఖుష్బూ ఇప్పటికి కూడా స్టార్‌ హీరోల సినిమాల్లో నటిస్తూనే ఉంది. ఈ మధ్య కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎక్కువ సినిమాలను చేస్తూ వస్తోంది. సోషల్‌ మీడియాలో ఖుష్బూ కి సంబంధించిన పోస్ట్‌ లు రెగ్యులర్‌ గా వైరల్‌ అవుతూ ఉంటాయి. అయితే ఈసారి ఆమె కలియుగ పాండవులు సినిమాకు సంబంధించిన పోస్ట్‌ లు షేర్ చేయడం మరింతగా వైరల్‌ అవుతున్నాయి. 38 సంవత్సరాలు పూర్తి చేసుకుంది అంటూ కొన్ని సినిమా స్టిల్స్ ను కూడా షేర్‌ చేసింది.

ఖుష్బూ సినిమా కి సంబంధించిన పోస్ట్‌ లు షేర్‌ చేయడంతో చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఆ సినిమాలో 38 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారో అలాగే ఇప్పుడు అందంగా ఉన్నారని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒకప్పుడు ఖుష్బూ కాస్త బరువు ఎక్కువ ఉన్నా కూడా ఇప్పుడు మాత్రం చాలా సన్నగా హీరోయిన్స్ కి పోటీ అన్నట్లుగా ఉంది. వయసు ఎక్కువ పెరుగుతున్నా కొద్ది వర్కౌట్‌ లు ఎక్కువగా చేస్తూ సోషల్‌ మీడియాలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది.

సురేష్ ప్రొడక్షన్స్‌ లో తన మొదటి సినిమా రూపొందిన కారణంగా అదే తన హోం బ్యానర్‌ అయ్యిందని ఖుష్బూ అన్నారు. తనకు కలియుగ పాండవులు సినిమాతో మంచి ఎంట్రీ ఇచ్చిన దర్శకులు రాఘవేంద్ర రావు గారికి ఎప్పటికి రుణపడి ఉంటాను. షూటింగ్‌ సమయంలో తనను సురేష్ ప్రొడక్షన్స్ వారు తమ ఇంటి సభ్యులుగా ట్రీట్‌ చేశారు. అప్పటి సంగతులు ఎప్పటికి మరచిపోలేను అంటూ చెప్పుకొచ్చంది. తనపై ఇన్నాళ్లుగా ప్రేమ అభిమానం చూపిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ ఖుష్బూ చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News