మంచు లక్ష్మి చారిటీ ఈవెంట్లో టాప్ 40 సెలబ్రిటీలు!
నటి లక్ష్మీ మంచు శనివారం హైదరాబాద్లో టీచ్ ఫర్ చేంజ్ అనే ఎన్జీఓ కోసం తన వార్షిక నిధుల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.;

నటి లక్ష్మీ మంచు శనివారం హైదరాబాద్లో టీచ్ ఫర్ చేంజ్ అనే ఎన్జీఓ కోసం తన వార్షిక నిధుల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మిస్ ఇండియా 2020 మానస వారణాసి, లిఖిత యలమంచిలి, వరుణ్ సందేశ్, రామ్ నితిన్ తదితరులు పిల్లల విద్య కోసం నిధులు సేకరించడానికి ర్యాంప్లో నడిచిన కార్యక్రమానికి రియా చక్రవర్తి షోస్టాపర్గా నిలిచింది.
ఈ సందర్భంగా హిందూస్తాన్ టైమ్స్ తో మాట్లాడిన మంచు లక్ష్మి.. 2025 అత్యంత ఆసక్తికరంగా ఉందని, ముంబైలో నివసించడం.. పని కోసం అంతటా ప్రయాణించడం బావుందని అన్నారు. ముంబైలో ఇంటి నుండి దూరంగా ఓదార్పును కనుగొన్నానని.. మిస్టరీ రియాలిటీ షోతో తెరపైకి వస్తున్నానని కూడా చెప్పారు.
భారతదేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్య నాణ్యతను మెరుగుపరచడానికి పనిచేస్తున్న లాభాపేక్షలేని సంస్థ టీచ్ ఫర్ చేంజ్కు లక్ష్మీ చైర్పర్సన్.. అలాగే ట్రస్టీ. ``ఇది నా బిడ్డ, మేము దీని కోసం నిధుల సేకరించడం ప్రారంభించి 11వ సంవత్సరంలోకి వచ్చాం`` అని లక్ష్మీ తెలిపారు. లాస్ ఏంజెల్స్ లో ఉన్నప్పటి నుంచి ఈ తరహా కార్యక్రమాలు చేసానని అన్నారు. విద్య అనేది మీరు ఒక బిడ్డకు ఇవ్వగల ఉత్తమ స్వేచ్ఛ అని నేను నిజంగా నమ్ముతున్నాను. అందుకే ప్రజలు స్వచ్ఛందంగా సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను అని తెలిపారు. అయితే ఈ ఫ్యాషన్ షోలో స్వచ్ఛంద సేవకుల కొరత లేదు. సంవత్సరాలుగా కొలీగ్స్ సహకరిస్తున్నారు. ఈ సంవత్సరం, మాకు 42 మంది నటులు ర్యాంప్ వాక్ చేస్తున్నారని లక్ష్మీ తెలిపారు.
సుష్మితా సేన్, దియా మీర్జా, రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, అదితి రావు హైదరి, హుమా ఖురేషి, సానియా మీర్జా, రకుల్ ప్రీత్ సింగ్, బిపాషా బసు, శ్రుతి హాసన్, సైనా నెహ్వాల్, హర్షవర్ధన్ రాణే కొన్నేళ్లుగా దీనికి మద్ధతిస్తున్నారని లక్ష్మీ తెలిపారు.