మంచు లక్ష్మి బికినీ మాయ.. స్టన్నింగ్!

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మంచు లక్ష్మి, ఇటీవల ముంబైకి మారారు

Update: 2024-08-14 13:45 GMT

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మంచు లక్ష్మి, ఇటీవల ముంబైకి మారారు. తండ్రి మోహన్ బాబు వారసురలిగా సినీ బాటలోనే ముందుకు సాగుతూ, టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది లక్ష్మి. నిర్మాతగా, నటిగా, ఇంకా వెబ్ సిరీస్‌లలో కూడా తన సత్తా చాటుతూ, ఇండస్ట్రీలో బిజీబిజీగా కనిపిస్తున్నారు. అయితే ఇటీవలే ఆమె తన కెరీర్‌లో కొత్త పుంతలు తొక్కాలనే లక్ష్యంతో ముంబైకి షిఫ్ట్ అయ్యినట్లు టాక్ వచ్చింది.

ముంబైకి మారడం వెనుక ఉన్న కారణాలు వెల్లడిస్తూ, బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నట్లు లక్ష్మి ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కొత్త అవకాశాల కోసం ఆడిషన్లకు కూడా వెళ్తున్నానని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా బాలీవుడ్‌లో పనిచేయాలనుకునే దర్శకుల గురించి కూడా ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ముంబైకి వెళ్లాక గ్లామర్ విషయంలో మరింత దూసుకుపోతున్నట్లు కనిపిస్తోంది.

రీసెంట్ గా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ముంబైకి మారిన విషయమై తన అనుభవాలను పంచుకున్నారు. ముంబైలో శాశ్వతంగా ఉంటారా అని ప్రశ్నించగా, లక్ష్మి తన సమాధానంతో నవ్వులు పూయించారు. బ్రేక్‌ఫాస్ట్ ముంబైలో, డిన్నర్ హైదరాబాద్‌లో అన్నట్లు ఉంది నా పరిస్థితి.. నా ఫ్రెండ్స్ నన్ను ముంబైలోనే ఉండమని సలహా ఇస్తున్నారు.. అని ఆమె తెలిపారు.

ఇక సోషల్ మీడియాలో మంచు లక్ష్మి పోస్ట్ చేసే ఫొటోలు నెవ్వర్ బిఫోర్ అనేలా ఉంటున్నాయి. ఇటీవల ఆమె బికినీలో కూడా దర్శనమిచ్చారు. పింక్ కలర్ బికినీలో అలా బీచ్ లో సెదతీరుతున్నట్లు ఉన్న మంచు లక్ష్మి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అలాగే ఆమె స్నేహితులతో ఉన్న పోటోలను కూడా షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇంతలో, మంచు లక్ష్మి నటించిన తాజా చిత్రం ఆదిపర్వం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రంలో లక్ష్మి ఏడు విభిన్న గెటప్స్‌లో కనిపించనున్నారు, అది కూడా డూప్ లేకుండా. ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఆమె బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకోవాలని ఉందని తెలియజేశారు. మరి ఈ సినిమా ద్వారా మంచు లక్ష్మి మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.

Tags:    

Similar News