నెగిటివ్ పోస్టుల‌పై మండి ప‌డిన మంజు మ‌నోజ్!

కోల్ క‌త్తా లో మ‌హిళా డాక్ట‌ర్ పై జ‌రిగిన అత్యాచార ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌న‌మైన సంగ‌తి తెలిసిందే.

Update: 2024-08-19 03:33 GMT

కోల్ క‌త్తా లో మ‌హిళా డాక్ట‌ర్ పై జ‌రిగిన అత్యాచార ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌న‌మైన సంగ‌తి తెలిసిందే. ఘ‌ట‌న‌పై యావ‌త్ దేశం ర‌గిలిపోతుంది. నిందితుల్ని త‌క్ష‌ణం శిక్షించాల‌ని ప్ర‌భుత్వం పై తీవ్రమైన ఒత్తిడి నెల‌కొంది. సోష‌ల్ మీడియా వేదిక‌గా బాధిత కుటుంబానికి అండ‌గా నెటి జ‌నులు నిలుస్తున్నారు. అయితే కొంద‌రు ఆక‌తాయిలు ఈ ఘ‌ట‌పై హేళ‌మైన కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. బాధితురాలిపై అస‌భ్య‌క‌ర పోస్టులు సైతం పెడుతున్నారు.

తాజాగా ఈ పోస్టుల‌పై మంచు మ‌నోజ్ ఆగ్రహం వ్య‌క్తం చేసాడు. అలాంటి పోస్టులు పెట్టిన వారిపై త‌క్ష‌ణం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేసాడు. జ‌న్మ‌నిచ్చిన మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌డంలో విఫ‌ల‌మ‌వ్వ‌డంతో నా హృద‌యం ముక్క‌లైంది. స్క్రీన్ వెనుక ఉండి దారుణ‌మైన పోస్టులు పెడుతు న్నారు. వారిని శిక్షించ‌డంలోనూ విఫ‌ల‌మ‌య్యాం. ఇలాంటి సంస్కృతిని నార్మ‌లైజ్ చేయ‌కుండా జ‌వాబుదారీగా నిలబ‌డాల‌ని కోరుకుంటున్నా` అని అన్నారు.

సోష‌ల్ మీడియాలో బాధితుల‌పై కొంద‌రు ఆక‌తాయిలు ఇష్టాను సారం పోస్టులు పెట్ట‌డం ఇది తొలిసారి కాదు. గ‌తంలోనూ కొంద‌రు అండ‌గా నిల‌వాల్సింది పోయి ఇష్టారీతున పోస్టులు పెట్టారు. ఆమ‌ధ్య తండ్రి-కూతుర వీడియో పై కొంద‌రు ఆక‌తాయిలు అస‌భ్య‌క‌ర పోస్టులు పెడితే న‌టుడు సాయితేజ్ అగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతో పాటు, ఏపీ, తెలంగాణ పోలీసుల్ని సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా కోరిన సంగ‌తి తెలిసిందే. అధికారులు, మంత్రులు వెంట‌నే స్పందించి వారిని ప‌ట్టుకుని కౌన్సిలింగ్ ఇవ్వ‌డం జ‌రిగింది.

ఇక కోల్ క‌త్తా ఆర్ జీక‌ర్ ఆసుప‌త్రిలో జ‌రిగిన ఘ‌ట‌పై సెల‌బ్రిటీలు పెద్ద ఎత్తున స్పందించిన సంగ‌తి తెలిసిందే. అన్ని ప‌రిశ్ర‌మ‌ల న‌టులు బాధిత కుటుంబానికి న్యాయం చేయాల‌ని డిమాండ్ చేసారు. అలాగే బాలీవుడ్ న‌టుడు హృతిక్ రోష‌న్ ఎమోష‌న‌ల్ పోస్ట్ అభిమానుల హృద‌యాన్ని తాకింది.

Tags:    

Similar News