మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్? హీరోయిన్ ఎవరంటే?

టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ అయినట్లు టాక్ వినిపిస్తోంది

Update: 2024-08-05 06:19 GMT

టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో నందమూరి వారసుడి తెరంగేట్రం ఖాయమైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో.. ఈ ప్రాజెక్ట్ గురించి క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

నందమూరి బాలకృష్ణ ఏ పని చేయాలన్నా మంచి రోజులు, ముహూర్తాలు, శుభ ఘడియలు చూసుకునే ముందడుగు వేస్తారని ఇండస్ట్రీలో అందరూ చెబుతుంటారు. ఇప్పుడు ఆయన తన కుమారుడి తెరంగేట్రానికి కూడా మంచి ముహూర్తాన్ని ఖరారు చేసినట్లుగా చెప్పుకుంటున్నారు. ఆషాఢం మాసం, మూఢం వెళ్లిపోవడంతో మోక్షజ్ఞ డెబ్యూ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

బాలకృష్ణ తెలుగు సినీ పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, సెప్టెంబర్ 1వ తేదీ సాయంత్రం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ సినీ ప్రముఖులు బాలయ్యను ఘనంగా సత్కరించనున్నారు. తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం, మోక్షజ్ఞ తొలి సినిమా అధికారిక ప్రకటనకు ఈ సన్మాన కార్యక్రమం వేదిక కాబోతోంది.

సెప్టెంబర్ 6న మోక్షజ్ఞ తన 30వ పుట్టినరోజును జరుపుకోనున్నాడు. అదే రోజున తన డెబ్యూ ప్రాజెక్ట్ ను గ్రాండ్ గా ప్రారంభించి, బర్త్ డే స్పెషల్ గా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. నందమూరి వారసుడి అరంగేట్రం కోసం ఫ్యాన్స్ చాలా ఏళ్లుగా వేచి చూస్తున్నారు. ఎట్టకేలకు సెప్టెంబర్ 1వ తేదీన బాలయ్య తన గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో మోక్షు మూవీ గురించి ప్రకటన చేస్తారని వార్తలు వస్తుండటంతో ఖుషీ అవుతున్నారు.

ఇదిలా ఉంటే మోక్షజ్ఞ సరసన నటించే కథానాయిక గురించి కూడా ఓ క్రేజీ రూమర్స్ వైరల్ అవుతోంది. అదేంటంటే దివంగత శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ ను ఈ సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం చేస్తారని అంటున్నారు. 'దేవర'తో జాన్వీ కపూర్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో, మోక్షు కి జోడీగా ఖుషీ నటించనుందనే వార్త అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఆగాల్సిందే.

ప్రశాంత్ వర్మ ఇప్పటి వరకూ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియాలతో, వేటికవే ప్రత్యేకమైన వైవిధ్యమైన సినిమాలే రూపొందించారు. ఇప్పుడు మోక్షజ్ఞ కోసం ఓ ఫాంటసీ మైథాలజికల్ స్క్రిప్ట్ రెడీ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. మహాభారతం స్పూర్తితో రాసుకున్న ఈ కథలో నందమూరి బాలకృష్ణ కూడా కీలక పాత్రలో నటిస్తారని టాక్. బాలయ్య చిన్న కూతురు, విశాఖపట్నం ఎంపీ సతీమణి తేజస్విని ఈ సినిమాని నిర్మిస్తారని సమాచారం. త్వరలోనే అన్ని వివరాలు అఫిషియల్ గా వెల్లడి కానున్నాయి.

Tags:    

Similar News