రాజమౌళిని మించిపోయేలా త్రివిక్రమ్ ప్లాన్

ఇదిలా ఉంటే తాజాగా లక్కీ భాస్కర్ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూ లో నిర్మాత నాగవంశీ త్రివిక్రమ్, బన్నీ కాంబోలో రాబోయే సినిమాపై ఓ హింట్ ఇచ్చాడు.

Update: 2024-10-25 04:50 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా బన్నీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రంపై 1000 కోట్లకి పైగా బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ఇండియాలోనే హైయెస్ట్ థీయాట్రికల్, నాన్ థీయాట్రికల్ బిజినెస్ జరిగిన చిత్రంగా ‘పుష్ప 2’ నిలిచింది. దీనిని బట్టి ఈ సినిమాపై ఏ స్థాయిలో బజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ప్రొడ్యూసర్స్, డిస్టిబ్యూటర్స్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మూవీ ప్రమోషన్స్ కి శ్రీకారం చుట్టారు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మూవీ చేయబోతున్నాడని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రంగానే ఈ సినిమాని త్రివిక్రమ్ తెరకెక్కించనున్నారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

‘గుంటూరు కారం’ డిజాస్టర్ తర్వాత గ్యాప్ తీసుకున్న త్రివిక్రమ్ కంప్లీట్ గా అల్లు అర్జున్ స్క్రిప్ట్ పైన వర్క్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా లక్కీ భాస్కర్ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూ లో నిర్మాత నాగవంశీ త్రివిక్రమ్, బన్నీ కాంబోలో రాబోయే సినిమాపై ఓ హింట్ ఇచ్చాడు. ఈ సినిమా నెవ్వర్ బిఫోర్ అనే విధంగా ఉంటుందని అన్నాడు. రాజమౌళి గారు మూవీస్ విషయంలో చాలా హైట్స్ ని చూపించారు.

అయితే రాజమౌళి గారు టచ్ చేయని జోనర్ లో త్రివిక్రమ్, బన్నీ మూవీ ఉండబోతోంది. ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయిపోయిందని చెప్పారు. ‘పుష్ప 2’ తర్వాత బన్నీ ఫ్రీ అయిపోతే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. అలాగే మార్చి నుంచి మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని చెప్పుకొచ్చారు. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ క్రియేట్ చేసిన వరల్డ్ ని ఇప్పటి వరకు ఎవ్వరు చూడలేదు. అలాగే ఆ విజువల్ కూడా నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది.

ఆ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడున్నంత స్పీడ్ గా అయితే ప్రాజెక్ట్స్ చేయమని, పూర్తిగా దానిపైన ఫోకస్ చేయనున్నట్లు చెప్పారు. అలాగే ఎవ్వరు బిలీవ్ చేయని స్థాయిలో ఆ మూవీ కచ్చితంగా ఉంటుందని నాగవంశీ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ మాటలతో ఫ్యాన్స్ అయితే త్రివిక్రమ్, బన్నీ కాంబో మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మైథాలజీ కథని త్రివిక్రమ్ చెబుతారా లేదంటే ఒక ఫిక్షనల్ వరల్డ్ ని క్రియేట్ చేస్తారా అనే క్యూరియాసిటీ అందరిలో ఉంది. ఏదేమైనా రాజమౌళిని మించిపోయేలా త్రివిక్రమ్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆ ప్రాజెక్టుపై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.

Tags:    

Similar News