హీరో హీరోయిన్లు ఆ సినిమాని లైట్ తీసుకున్నారా?

ఇప్పుడు 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' మూవీ ఫస్ట్ లుక్ ను కూడా దర్శక నిర్మాతలు తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా సినీ అభిమానులతో పంచుకున్నారు.

Update: 2024-10-07 15:15 GMT

యువ హీరో నిఖిల్ సిద్దార్థ ఎప్పటికప్పుడు డిఫెరెంట్ స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేస్తుకుంటూ, ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.. సొంత మార్కెట్ క్రియేట్ చేసుకోడానికి కష్టపడుతున్నాడు. 'కార్తికేయ 2' సినిమాతో పాన్ ఇండియా దృష్టిని ఆకర్షించిన నిఖిల్.. అప్పటి నుంచి పాన్ ఇండియా అప్పీల్ ఉన్న భారీ కథలతో ముందుకు సాగుతున్నాడు. అయితే నిఖిల్ హీరోగా నటించిన ఓ సినిమా ఇప్పుడు ఉన్నట్టుండి ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయిపోయింది. ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయని మేకర్స్.. తాజాగా ఫస్ట్ లుక్ ని లాంచ్ చేయడమే కాదు, విడుదలను కూడా ప్రకటించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

నిఖిల్ ప్రస్తుతం 'స్వయంభు', 'ది ఇండియా హౌస్' అనే రెండు మల్టీ లాంగ్వేజ్ మూవీస్ చేస్తున్నాడు. అయితే ఆయన హీరోగా “అప్పుడో ఇప్పుడో ఎప్పుడో” అనే టైటిల్ తో ఓ కొత్త సినిమాకి ప్రకటన వచ్చింది. సుధీర్ వర్మ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో 'సప్త సాగరాలు దాటి' ఫేమ్ రుక్మిణి వసంత్, 'మజిలీ' ఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటి దాకా ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి విషయాలు బయటకు రాలేదు. కానీ ఆదివారం నాడు మేకర్స్ సడెన్ గా ఫస్ట్ లుక్ ని లాంచ్ చేసి, దీపావళికి రిలీజ్ అని అనౌన్స్ చేసారు. దీంతో అసలు నిఖిల్ ఈ సినిమా ఎప్పుడు చేశారు అని అందరూ షాక్ అయ్యారు.

నిజానికి “అప్పుడో ఇప్పుడో ఎప్పుడో” అనేది ఇప్పటికిప్పుడు ఊడిపడిన ప్రాజెక్ట్ కాదు. దాదాపు మూడేళ్ల కిందటి సినిమా. 'స్వామి రారా' 'కేశవ' తర్వాత నిఖిల్ - సిద్దార్థ్ కాంబోలో కమిటైన హ్యాట్రిక్ మూవీ. 2021-22 టైంలో షూటింగ్ చేసారు. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ, ఈ సినిమా లేట్ అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ దీపావళికి రాబోతోందని ఫ్యాన్స్ సంతోష పడుతున్నారు. కానీ హీరో హీరోయిన్లు మాత్రం ఎందుకనో ఈ మూవీ పట్ల పెద్దగా ఆసక్తి కనబరచడం లేదనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తోంది. దీనికి కారణం వారిద్దరూ ప్రచారంలో పాల్గొనకపోవడమే అని తెలుస్తోంది.

ఏదైనా సినిమాకు సంబంధించిన అప్డేట్ వస్తుందంటే, దాంతో సంబంధమున్న ప్రతీ ఒక్కరూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి తమవంతు ప్రమోషన్స్ చేయడం మనం చూస్తుంటాం. ఇప్పుడు 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' మూవీ ఫస్ట్ లుక్ ను కూడా దర్శక నిర్మాతలు తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా సినీ అభిమానులతో పంచుకున్నారు. దివ్యాంశ కౌశిక్ సైతం ఫస్ట్ లుక్ ను రీపోస్ట్ చేసింది. కానీ నిఖిల్, రుక్మిణి వసంత్ మాత్రం ఎలాంటి పోస్టులు పెట్టలేదు. దీంతో హీరో హీరోయిన్లు ఈ సినిమాని లైట్ తీసుకుంటున్నారేమో అనే కామెంట్స్ వస్తున్నాయి.

నిఖిల్, రుక్మిణి వసంత్ లు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండరు అనుకోడానికి.. రుక్మిణి తాను నటిస్తున్న 'భైరతి రణగల్' మూవీ అప్డేట్ ను ఆదివారం ఎక్స్ లో పోస్ట్ చేసింది. మరోవైపు నిఖిల్ తాజాగా 'కార్తికేయ 2' నేషనల్ ఫిలిం అవార్డుకు సంబంధించిన పోస్టును రీపోస్ట్ చేసారు. కానీ వీళ్ళిద్దరూ 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' ఫస్ట్ లుక్ ను ఎక్కడా ప్రస్తావించలేదు. మూవీ ప్రమోషన్స్ విషయంలో హీరో హీరోయిన్లు ఇలా వ్యవహరించడంతో అసలేం జరిగిందో అనే చర్చ ఫిలిం సర్కిల్స్ లో మొదలైంది.

నిజానికి 'కార్తికేయ 2' తర్వాత వచ్చిన 'స్పై' సినిమా విషయంలోనూ నిఖిల్ ఇలానే వ్యవహరించారు. చాలా రోజులు ప్రమోషన్స్ కు దూరంగా ఉంటూ వచ్చి, రిలీజ్ కు ముందు ఆఖరి నిమిషంలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ సినిమా రిజల్ట్ ఏమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇన్సైడ్ ఏం జరిగిందో తెలియదు కానీ, ఇప్పుడు 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' సినిమాని కూడా నిఖిల్ ప్రమోట్ చెయ్యడం లేదు. హీరోయిన్ రుక్మిణి వసంత్ సైతం తన టాలీవుడ్ డెబ్యూ మూవీని ప్రమోట్ చేసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరి రానున్న రోజుల్లోనైనా హీరో హీరోయిన్లు ఈ సినిమా ప్రచారంలో భాగం అవుతారో లేదో చూడాలి.

Tags:    

Similar News