ఎల్లమ్మ.. అటుతిరిగి ఇటుతిరిగి..

బలగం సినిమాతో దర్శకుడిగా మారిన కమెడియన్ వేణు నెక్స్ట్ ప్రాజెక్ట్ గా ఎల్లమ్మ అనే చిత్రాన్ని ప్రకటించాడు.

Update: 2024-10-15 07:39 GMT

బలగం సినిమాతో దర్శకుడిగా మారిన కమెడియన్ వేణు నెక్స్ట్ ప్రాజెక్ట్ గా ఎల్లమ్మ అనే చిత్రాన్ని ప్రకటించాడు. దిల్ రాజు బ్యానర్ లోనే ఈ సినిమా కూడా తెరకెక్కనుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ మూవీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో విలేజ్ నేపథ్యంలో నడిచే కథతో ఉండబోతోందంట. ముందుగా ఈ చిత్రం కోసం నేచురల్ స్టార్ నానిని హీరోగా అనుకున్నారు. అతను కూడా ఒకే చెప్పాడు. మూవీ ఎనౌన్సమెంట్ కూడా జరిగిపోయింది.

అయితే నాని ఈ సినిమా నుంచి ఎందుకనో డ్రాప్ అయిపోయారు. దీంతో వేణు మరో ముగ్గురు హీరోలని ఈ సినిమా కోసం సంప్రదించారు. వారిలో నితిన్, తేజ సజ్జా, శర్వానంద్ ఉన్నారు. ఈ ముగ్గురికి వేణు కథని నేరేట్ చేసినట్లు సమాచారం. నాని తర్వాత వేణు, నితిన్ ని అప్రోచ్ అయ్యి ‘ఎల్లమ్మ’ కథ చెప్పారంట. ముందుగా అతను ఎలాంటి నిర్ణయాన్ని చెప్పలేదు. దీంతో తేజా సజ్జా, శర్వానంద్ ని కూడా సంప్రదించారు. వారు కూడా ఇంకా క్లారిటీ ఇవ్వలేదని టాక్. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని నితిన్ కన్ఫర్మ్ చేసాడనే మాట వినిపిస్తోంది.

ఆల్ మోస్ట్ నితిన్ ఈ సినిమా చేయడం ఖాయం అని అంటున్నారు. దిల్ రాజు బ్యానర్ లో నితిన్ ప్రస్తుతం ‘తమ్ముడు’ సినిమా చేస్తున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘ఎల్లమ్మ’ మూవీ కూడా దిల్ రాజు నిర్మిస్తూ ఉండటంతో నితిన్ ఒకే చెప్పాడనే టాక్ నడుస్తోంది. ఇప్పటి వరకు నితిన్ కూడా కంప్లీట్ మాస్ క్యారెక్టరైజేషన్ లో మూవీ చేయలేదు. ఇది తనకి కెరియర్ పరంగా ప్లస్ అవుతుందని నితిన్ భావిస్తున్నాడంట.

ప్రస్తుతం వేణు ఈ మూవీ కోసం ఇతర క్యాస్టింగ్ అండ్ క్రూని ఖరారు చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. 2025 ఆరంభంలో ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. నితిన్ ప్రస్తుతం ‘తమ్ముడు’ సినిమాతో పాటు వెంకి కుడుముల దర్శకత్వంలో ‘రాబిన్ హుడ్’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ డిసెంబర్ 20న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే రెండు సినిమాలు వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకొచ్చే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News