ఎన్టీఆర్ ఫ్యూచర్.. 1000 కోట్ల ఫ్రేమ్ ఇది!

ఈ ముగ్గురు దర్శకులతో ఎన్టీఆర్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కెరియర్ కి ఈ ముగ్గురు దర్శకులతో చేస్తోన్న సినిమాలు చాలా కీలకమైన ప్రాజెక్ట్స్ గా ఉన్నాయి.

Update: 2024-09-10 05:07 GMT

ఆర్ఆర్ఆర్ సినిమాతో యంగ్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే ఆ సినిమా సక్సెస్ లో మేజర్ క్రెడిట్ రాజమౌళికి వెళ్ళింది. చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కి ఆర్ఆర్ఆర్ తో నేషనల్ వైడ్ క్రేజ్ వచ్చింది. అయితే అది సోలోగా ఏ స్థాయిలో ఉందనేది ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఇద్దరు హీరోలకి వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీతో తన స్టామినాని చెక్ చేసుకుంటున్నారు.

 

ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా హైప్ నెలకొని ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతోంది. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కోసం ఎన్టీఆర్ తో పాటుగా దేవర టీమ్ అంతా ముంబైలో అడుగుపెట్టారు. రెండు రోజుల నుంచే అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా చాలా మంది సినీ ప్రముఖులు ఎన్టీఆర్ ని కలవడం జరిగింది.

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ, అయాన్ ముఖర్జీ, ప్రశాంత్ నీల్ తో వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఈ ముగ్గురు ఎన్టీఆర్ తో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఫోటో చూడటానికి సింపుల్ గా ఉన్న కూడా కరెక్ట్ గా చూస్తే ఎన్టీఆర్ ఫ్యూచర్ కనిపిస్తుంది. ఈ ముగ్గురు దర్శకులతో ఎన్టీఆర్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కెరియర్ కి ఈ ముగ్గురు దర్శకులతో చేస్తోన్న సినిమాలు చాలా కీలకమైన ప్రాజెక్ట్స్ గా ఉన్నాయి.

కొరటాల శివతో చేస్తోన్న దేవర మూవీతో పాన్ ఇండియా లెవల్ లో తన మార్కెట్ స్టామినా ఎంత ఉందనేది తెలియనుంది. ఈ సినిమా 500+ కోట్లకి పైగా కలెక్షన్స్ అయితే అందుకుంటాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బాలీవుడ్ లో కూడా దేవర క్లిక్ అయితే 700 కోట్లు అందుకున్న ఆశ్చర్యపోవాల్సిన పని లేదని అంటున్నారు. 1000 కోట్లు అనేది సినిమా టాక్ ను బట్టి ఉంటుంది. ఇక అయాన్ ముఖర్జీతో జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ స్ట్రైట్ హిందీ మూవీ వార్ 2 చేస్తున్నారు.

అది కూడా మల్టీ స్టారర్ గా స్పై థ్రిల్లర్ ఫ్రాంచైజ్ లో ఒకటిగా వస్తోంది. కరెక్ట్ గా మూవీ క్లిక్ అయితే ఈ సినిమా 1000 కోట్లు చాలా ఈజీగా టచ్ చేసే ఛాన్స్ ఉంది. దీంతో బాలీవుడ్ లో తారక్ కి ఇమేజ్ డబుల్ అవుతుంది. నెక్స్ట్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్న డ్రాగన్ మూవీ నెవ్వర్ బిఫోర్ అనే రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. ఈ సినిమాతో తారక్ కి గ్లోబల్ ఇమేజ్ రావడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. టాలీవుడ్ నుంచి కొరటాల శివకి దేవరనే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ.

అయితే అయాన్ ముఖర్జీ బాలీవుడ్ లో ఇప్పటికే బ్రహ్మాస్త్రతో పాన్ ఇండియా రేంజ్ లో తనని తాను ప్రూవ్ చేసుకున్నారు. ఇక శాండిల్ వుడ్ దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సిరీస్, సలార్ తో పాన్ ఇండియా సక్సెస్ లు అందుకొని క్రేజ్ పరంగా రాజమౌళి తర్వాత స్థానంలో ఉన్నారు. కాబట్టి ఎన్టీఆర్ కు అది కూడా 1000 కోట్ల ట్రాక్ ను సెట్ చేసే ఉంటుంది. ఎన్టీఆర్ మార్కెట్ మాత్రం ఈ ముగ్గురు దర్శకులతో మరో లెవెల్ కు పెరిగే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. ఫైనల్ గా మంచి టాక్ వస్తే తారక్ కు తిరుగుండదంతే.

Tags:    

Similar News