ఇటు వీర‌మ‌ల్లు..అటు ఓజీ..కానీ ఒకేసారి కాదు!

ప‌వన్ డేట్లు ఇవ్వ‌డ‌మే మ‌హాభాగ్యంగా భావించిన మేక‌ర్స్ ఏమాత్రం స‌మ‌యం వృద్ధా చేయ‌కుండా చ‌క‌చ‌కా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు.

Update: 2024-10-18 23:30 GMT

ఇటు 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు'.. అటు 'ఓజీ' షూటింగ్ ఏక కాలంలో జ‌రుగుతున్నాయా? రెండు చిత్ర యూనిట్ లు ప‌రుగులు పెట్టి ప‌నిచేస్తున్నారా? అంటే అవుననే తెలుస్తోంది. ప్ర‌స్తుతానికి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయం నుంచి రిలీవ్ అయ్యారు. మొన్న‌టివ‌ర‌కూ తిరుప‌తి ల‌డ్డు క‌ల్లీ వ్య‌వ‌హారం లో ప‌వ‌న్ బిజీగా ఉన్నారు. వైకాపా పార్టీ తీరును ఎండ‌గ‌ట్టే ప‌నిలో బిజీ అయ్యారు. ఇప్పుడా వ్య‌వ‌హారం ఓ కొలిక్కి రావ‌డంతో ప‌వ‌న్ రిలాక్స్ అవుతున్నారు.

దీంతో ఆయ‌న య‌ధావిధిగా మ‌ళ్లీ షూటింగ్ కి హాజ‌ర‌వుతున్నారు. ముందుగా డేట్లు ఇచ్చిన ప్ర‌కారం 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' షూటింగ్ కే హాజ‌ర‌వుతున్నారు. తాడేప‌ల్లి స‌మీపంలో ప్ర‌త్యేకంగా వీర‌మ‌ల్లు సెట్లు వేసి షూటింగ్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ల‌డ్డు వ్య‌వ‌హారానికి ముందు ఓ షెడ్యూల్ పూర్తి చేసారు. తాజాగా కొత్త షెడ్యూల్ కూడా అదే సెట్ లో ప్రారంభం అవ్వ‌డంతో షూట్ కి వెళ్తున్నారు.

ప‌వన్ డేట్లు ఇవ్వ‌డ‌మే మ‌హాభాగ్యంగా భావించిన మేక‌ర్స్ ఏమాత్రం స‌మ‌యం వృద్ధా చేయ‌కుండా చ‌క‌చ‌కా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు. వీర‌మ‌ల్లు షూటింగ్ కి సంబంధించి ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రికొన్ని రోజులు సెట్స్ కి హాజ‌రైతే ఆయ‌న అక్క‌డ నుంచి రివీల్ అవుతారు. అటుపై వెంట‌నే ఓజీ షూట్ లో పాల్గొంటారు. ఈ లోగా 'ఓజీ' టీమ్ మిగ‌తా స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌పై దృష్టి పెట్టి ప‌నిచేస్తోంది. ప‌వ‌న్ వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచి కేవ‌లం ఆయ‌న‌పైనే షూట్ ఉంటుంది.

'ఓజీ' కి సంబంధించి కొన్ని నైట్ స‌న్నివేశాలు కూడా ఉన్నాయ‌ట‌. దీనిలో భాగంగా ప‌వ‌న్ నైట్ కూడా షూటింగ్ కి హాజ‌రు కావాల్సి ఉంది. ఎలా లేద‌న్నా? డిసెంబ‌ర్ ముగింపు క‌ల్లా ఈ రెండు సినిమాల షూటింగ్ పూర్త‌వుతుంది. అటుపై ప‌వ‌న్ 2025 లో 'ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్' కి డేట్లు కేటాయించే అవ‌కాశం ఉంటుంది. 'ఓజీ'..'వీర‌మ‌ల్లు' చిత్రాలు వ‌చ్చే ఏడాది రిలీజ్ అవుతాయి.

Tags:    

Similar News