బుట్ట బొమ్మ మరీ ఇంత సైలెంట్ గానా..?

తనకు స్టార్ డం ఇచ్చిన టాలీవుడ్ మీద అమ్మడు ప్రేమ చూపిస్తున్నా ఇక్కడ మాత్రం ఆమెను అసలు ఎవరు పట్టించుకోవట్లేదు.

Update: 2024-09-27 10:30 GMT

రెండేళ్ల క్రితం తెలుగులో స్టార్ సినిమా అంటే చాలు ఫస్ట్ పూజా హెగ్దే దగ్గరకు వెళ్లాకే ఆ నెక్స్ట్ వేరే హీరోయిన్ దగ్గరకు వెళ్లే పరిస్థితి కనిపించింది. ఐతే ఆ ఇయర్ చేసిన సినిమాలన్నీ నిరాశపరచడంతో పూజాని లైట్ తీసుకున్నారు మన మేకర్స్. మహేష్ గుంటూరు కారంలో కొంత పార్ట్ షూట్ లో పాల్గొన్నా కొన్ని కారణాల వల్ల ఆ సినిమా నుంచి తప్పుకుంది అమ్మడు. అప్పటి నుంచి పూజా హెగ్దే ఖాతాలో ఒక్క తెలుగు సినిమా పడలేదు. తనకు స్టార్ డం ఇచ్చిన టాలీవుడ్ మీద అమ్మడు ప్రేమ చూపిస్తున్నా ఇక్కడ మాత్రం ఆమెను అసలు ఎవరు పట్టించుకోవట్లేదు.

అందుకే తనకు అవకాశం ఇస్తున్న బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలనే చేస్తూ వస్తుంది అమ్మడు. ప్రస్తుతం తమిళ్ లో సూర్య హీరోగా చేస్తున్న సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. సూర్య 44వ సినిమాగా వస్తున్న ఈ సినిమాను కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో సూర్య గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నారు. కార్తీ వింటేజ్ లుక్ తో వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచింది.

ఐతే ఈమధ్యనే షూటింగ్ మొదలు పెట్టిన ఈ సినిమాలో తన పోర్షన్ కంప్లీట్ చేసిందట పూజా హెగ్దే. ఇంత సైలెంట్ గా షూటింగ్ అయిపోవడం ఏంటని ఆడియన్స్ ఆశ్చర్యపడుతున్నారు. పూజా హెగ్దే పోర్షన్ అంతా పూర్తి చేసి ఆమెకు చిత్ర యూనిట్ గుడ్ బై చెప్పేశారట. సూర్య 44 తో పాటు హిందీలో ఒక సినిమా చేస్తున్న పూజా హెగ్దే ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది.

విజయ్ తో బీస్ట్ సినిమా చేసిన పూజా హెగ్దే ఆ తర్వాత మరో ఛాన్స్ అందుకోలేదు. మళ్లీ సూర్య 44 లో అవకాశం దక్కించుకుంది. సూర్య 44 సినిమా ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తుందని తెలుస్తుంది. తప్పకుండా ఈ సినిమా సూర్య ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కు నచ్చేస్తుందని అంటున్నారు. కోలీవుడ్ లో తీస్తున్న సరే సూర్య 44 సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. కుదిరితే ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ కూడా చేయాలని మేకర్స్ ట్రై చేస్తున్నారు. సో బాలీవుడ్ లో పూజా క్రేజ్ సూర్య 44 సినిమాకు కలిసి వస్తుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News