ఇది కదా ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకుంది!

రొమాంటిక్ హారర్ కామెడీగా 'ది రాజా సాబ్' సినిమా రూపొందుతోంది. ప్రభాస్ తన కెరీర్ లో ఫస్ట్ టైం ఈ జోనర్ లో నటిస్తున్నారు.

Update: 2024-10-22 04:23 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజీ ప్రాజెక్ట్స్ ను సెట్ చేస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు. గడిచిన రెండేళ్ల కాలంలో ఆయన్నించి 'రాధే శ్యామ్', 'ఆదిపురుష్', 'సలార్ పార్ట్-1', 'కల్కి 2898 AD' వంటి నాలుగు సినిమాలను అందించారు. త్వరలో 'కన్నప్ప' చిత్రంలో అతిథి పాత్రతో అలరించబోతున్నారు. ఇలా ప్రభాస్ వరుస సినిమాల్లో నటిస్తూ బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్నందుకు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ, తమ హీరో లుక్స్ విషయంలో మాత్రం హ్యాపీగా లేరు.

 

ప్రభాస్ నుంచి ఎన్ని సినిమాలు వస్తున్నా, దాదాపు ఒకే రకమైన లుక్ లో కనిపిస్తున్నారు. మేకర్స్ ఆయన కాస్ట్యూమ్స్ లో వెరీయేషన్ చూపిసున్నారు తప్పితే, కొత్త లుక్ లో ప్రజెంట్ చేయడం లేదు. దీనికి తోడు డార్లింగ్ సినిమాల నుంచి ఏ పోస్టర్ వచ్చినా సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం మామూలు అయిపోయింది. ప్రభాస్ ఫేస్ చాలా మారిపోయిందని.. అందుకే క్లోజప్ షాట్స్ కూడా పెట్టడం లేదని నెగిటివ్ కామెంట్స్ చేసారు. దీంతో నిరుత్సాహానికి గురైన ఫ్యాన్స్.. ప్రభాస్ ను కొత్తగా చూడాలని కోరుకున్నారు. ఇన్నాళ్లకు డైరెక్టర్ మారుతీ వాళ్ళ కోరిక తీర్చాడని అంటున్నారు.

ప్రభాస్‌ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘ది రాజాసాబ్‌’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబరు 23న డార్లింగ్ పుట్టినరోజు సందర్భంగా రాయల్‌ ట్రీట్‌ ఇవ్వడానికి మేకర్స్ రెడీ అయ్యారు. ఈ మేరకు ముందుగానే ఓ స్పెషల్ పోస్టర్‌ ను ఆవిష్కరించారు. ఇందులో ప్రభాస్ గళ్ల చొక్కా, నల్ల కళ్లద్దాలు పెట్టుకుని స్టైల్‌గా నడుస్తూ కనిపించారు. క్లాస్ గా కనిపిస్తూనే మాస్ ను కూడా ఆకట్టుకున్నారు. రీసెంట్ టైమ్స్ లో రెబల్ స్టార్ బెస్ట్ లుక్ ఇదేనని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

రొమాంటిక్ హారర్ కామెడీగా 'ది రాజా సాబ్' సినిమా రూపొందుతోంది. ప్రభాస్ తన కెరీర్ లో ఫస్ట్ టైం ఈ జోనర్ లో నటిస్తున్నారు. కొత్త తరహా కథలో నటిస్తుండటమే అందర్నీ ఎంతో ఎగ్జైట్ చేస్తుంటే.. ఆయన న్యూ లుక్ లో కనిపించడం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. ప్రభాస్ ను సరికొత్తగా స్టైలిష్ లుక్ లో ప్రజెంట్ చేయడంలో దర్శకుడు మారుతి సక్సెస్ అయ్యారు. 'మిర్చి' తర్వాత తమ హీరో బెస్ట్ లుక్ ఇదేనని అభిమానులు కొనియాడుతున్నారు. వింటేజ్ ప్రభాస్ ఈజ్ బ్యాక్ అని కామెంట్లు పెడుతున్నారు. మారుతికి థాంక్స్ చెబుతూ, ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

'ది రాజాసాబ్' సినిమాలో మాళవికా మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధి కుమార్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఏచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న ఈ చిత్రం విడుదల కానుంది. దీంతో పాటుగా హను రాఘవూడితో 'ఫౌజీ', సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో 'స్పిరిట్' సినిమాల్లో ప్రభాస్ కనిపించనున్నారు.

Tags:    

Similar News