ఇండియాలో ఈ ఇద్దరిదే బెస్ట్ లైనప్

ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్ హీరోలు శాసించే స్థాయికి ఎదిగారు.

Update: 2024-10-14 07:30 GMT

ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇద్దరు స్టార్ హీరోలు శాసించే స్థాయికి ఎదిగారు. వందల కోట్ల బడ్జెట్ తో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ వేలకోట్ల కలెక్షన్స్ అందిస్తూ నిర్మాతలకి కనకవర్షం కురిపిస్తున్నారు. సౌత్ నుంచి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస విజయాలతో పాన్ ఇండియా రేంజ్ లో నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ కు 600 కోట్ల మార్కెట్ ఉంది. ‘సలార్’ మూవీతో 700 కోట్లు కొల్లగొట్టిన డార్లింగ్ ‘కల్కి 2898ఏడీ’ తో 1150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ లైన్ అప్ లో ఏకంగా ఐదు సినిమాల వరకు ఉన్నాయి. మారుతి దర్శకత్వంలో చేస్తోన్న ‘ది రాజాసాబ్’ షూటింగ్ ఫైనల్ స్టేజ్ కి వచ్చింది. ఈ మూవీ 2025 ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ మూవీ షూటింగ్ ఇప్పటికే మొదలైంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ మూవీ 2025 ఆరంభంలో సెట్స్ పైకి వెళ్లనుంది. 500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మూడు సినిమాలతో పాటు ‘కల్కి పార్ట్ 2’, ‘సలార్ పార్ట్ 2’ సినిమాలు కూడా లైన్ అప్ లో ఉన్నాయి.

ఈ సినిమాల మొత్తం బడ్జెట్ 2500 కోట్ల వరకు ఉండబోతోంది. అలాగే ఈ మూవీస్ పైన కూడా 3000 కోట్ల వరకు బిజినెస్ జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రభాస్ తర్వాత అంత ప్రామిసింగ్ లైన్ అప్ ఉన్న స్టార్ గా బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ కనిపిస్తున్నాడు. ‘బ్రహ్మాస్త్ర’, ‘యానిమల్’ సినిమాలతో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ని రణబీర్ కపూర్ తన ఖాతాలో వేసుకున్నారు. ‘యానిమల్’ మూవీ ఏకంగా 900 కోట్ల కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది.

నెక్స్ట్ రణబీర్ కపూర్ లైన్ అప్ లో ‘రామాయణం’ సిరీస్ ఉంది. రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ సినిమా ఓవరాల్ బడ్జెట్ 1000 కోట్లని తెలుస్తోంది. ఇందులో మొదటి పార్ట్ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. దీని తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘యానిమల్ పార్క్’ మూవీ స్టార్ట్ కానుంది. ఈ సినిమాకి కూడా 400 కోట్ల వరకు ఖర్చు కానున్నట్లు తెలుస్తోంది. అలాగే అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ‘బ్రహ్మాస్త్ర 2’ కూడా లైన్ అప్ లో ఉంది.

అలాగే యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో మోస్ట్ ప్రెస్టీజియస్ ఫ్రాంచైజ్ ‘ధూమ్’ సిరీస్ లో రణబీర్ కపూర్ భాగం కాబోతున్నాడు. ‘ధూమ్ 4’ లో రణబీర్ కపూర్ కన్ఫర్మ్ అయ్యాడు. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది క్లారిటీ లేదు. ఇలా నాలుగు సినిమాల వరకు రణబీర్ కపూర్ ఖాతాలో ఉన్నాయి. ఈ ఇద్దరు హీరోలు కూడా ఇండియన్ సూపర్ స్టార్స్ గా వరల్డ్ వైడ్ గా తన ఇంపాక్ట్ ని చూపించబోతున్నట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. వీరు చేయబోయే సినిమాలతో ఇండియన్ సినిమా మార్కెట్ స్థాయి కూడా పెరగబోతోందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Tags:    

Similar News